నితిన్ తండ్రి వర్సెస్ సురేష్బాబు..!
చిరంజీవి పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా తమిళంలో విజయ్ హీరో గా వచ్చి సూపర్ హిట్ అయిన కత్తి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఇటీవల వరుసగా గోపాల గోపాల - కాటమరాయుడు - గబ్బర్ సింగ్ ఇప్పుడు వస్తున్న భీమానాయక్ ఇలా వరుసగా రీమేక్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. వెంకటేష్ దృశ్యం - దృశ్యం 2 తో పాటు నారప్ప ఇలా.. తన కెరీర్లో ఎక్కువుగా రీమేక్ సినిమాలపై ప్రధానంగా ఆధార పడుతూ వచ్చారు.
ఇక తాజాగా తమిళంలో శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ అయిన మానాడు సినిమా రీమేక్ రైట్స్ కోసం తెలుగులో టాప్ నిర్మాతలు పోటీపడుతున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు, సితార ఎంటర్టైన్మెంట్ వంటి సంస్థలు ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.
అయితే ఈ సినిమా రీమేక్ / డబ్బింగ్ హక్కులు హీరో శింబు దగ్గర ఉన్నాయట. అయితే ఆయన మాత్రం తెలుగులో నేరుగా డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి మాత్రం ఎలాగైనా రీమేక్ రైట్స్ దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట.