ఎలెర్ట్ అయిన రాథే శ్యామ్ యూనిట్ ట్రైలర్ లో మార్పులు !

Seetha Sailaja

సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘రాథే శ్యామ్’ మూవీలోని పాటలు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా లేవని ఆపాటల ట్యూన్స్ అంతా హిందీ పాటల ట్యూన్స్ లా ఉన్నాయని ప్రభాస్ అభిమానులలో కూడ అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ బాలీవుడ్ సంగీత దర్శకుడు కావడంతో అతడు ట్యూన్ చేసిన పాటలు అన్నీ హిందీ సినిమా ట్యూన్స్ లా ఉన్నాయని ప్రభాస్ అభిమానుల అభిప్రాయం.

ఇప్పుడు ఈ అసంతృప్తి ‘రాథే శ్యామ్’ దర్శక నిర్మాతల వరకు చేరడంతో త్వరలో విడుదల కాబోతున్న ఈమూవీ ట్రైలర్ లో ఈసినిమా కథకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే విధంగా లీకులు ఇస్తూ ఈమూవీ ట్రైలర్ ను కట్ చేస్తున్నట్లు టాక్. భవిష్యవాణి తెలిసిన వ్యక్తిగా ఈమూవీలో ప్రభాస్ నటిస్తూ ఉంటే పూజ హెగ్డే డాక్టర్ గా కనిపించబోతోంది.

వీరిద్దరి పాత్రలతో పాటు ట్రైన్ కూడ ఈమూవీలో ఒక కీలక పాత్రలా కనిపిస్తుంది కాబట్టి ఈమూవీకి సంబంధించి చిత్రీకరించిన ట్రైన్ ఎపిసోడ్ సీన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతాయి అంటున్నారు. 1970 ప్రాంతంలో యూరప్ లో జరిగిన ఒక ట్రైన్ యాక్సిడెంట్ ను ఆధారంగా చేసుకుని ఈకథలో ట్రైన్ కు కూడ కీలక పాత్రను కల్పించారు అని తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ లో చూడని ఒక భగ్న ప్రేమికుడి వ్యథను కూడ ఈమూవీలో ప్రేక్షకులు చూడబోతున్నారు.

ఒకవైపు ఒమైక్రాన్ వైరస్ భారత్ లోకి దూసుకు వస్తున్నా సంక్రాంతి సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియకపోయినా ఈమూవీ రిలీజ్ సంక్రాంతికి ఉండి తీరుతుందని ఈమూవీ నిర్మాతలు బయ్యర్లకు భరోసా ఇస్తున్నట్లు టాక్. ప్రస్తుతం రీ రికార్డింగ్ దశలో తన పనులు పూర్తి చేసుకుంటున్న ఈమూవీ యూనిట్ డిసెంబర్ రెండవ వారానికి ఒమైక్రాన్ పై ఒక స్పష్టత వచ్చిన తరువాత ఈమూవీ ప్రమోషన్ ను దేశవ్యాప్తంగా చేయబోతున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: