పుష్పరాజ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన శ్రీవల్లి...!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది.క్రియేటర్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తోందని అందరికి తెలిసిన విషయమే.

పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తుండగా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను పుష్ప ది రైజ్ అనే టైటిల్‏లో డిసెంబర్ 17న విడుదల చేయనున్నారని తెలుస్తుంది.. ఈ క్రమంలో పుష్ప ప్రమోషన్స్ వేగవంతం చేసిందట చిత్రయూనిట్. ఎప్పటికప్పుడు పుష్ప నుంచి అప్డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారట ఆ చిత్ర మేకర్స్. ఇదిలా ఉంటే పుష్ప విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో బన్నీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందట హీరోయిన్ రష్మిక మందన.

మూవీ త్వరలో విడుదల కాబోతుంది కదా సర్.. స్పెషల్‏గా ఏదైనా పంపించాలనిపించిందని చెప్పుకొచ్చిందట. అందుకే సర్‏ప్రైజ్ గిఫ్ట్ మీకోసం అంటూ చేతితో రాసి నోట్.. కొన్ని వస్తువులను బాక్స్ లో పెట్టి పంపించిందట. దీనిని అల్లు అర్జున్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ రష్మికకు ధన్యవాదాలు తెలిపాడని తెలుస్తుంది.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ మరియు ముత్తమ్ శెట్టి మీడియా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోందని తెలుస్తుంది.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని సమాచారం.. ఇందులో విలన్ గా మలయాళ స్టార్ హీరో అయిన ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ మరియు సునీల్ కీలక పాత్రలలో కనిపించనున్నారట.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి మరియు సామీ సామీ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలుస్తుంది.ఇప్పటికే విడుదలైన టీజర్ గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: