సీరియల్స్ లోకి పోసాని కృష్ణమురళి ఎంట్రీ... కారణం ఇదేనా?

VAMSI
చాలామంది సినీ నటులు సినిమాల్లో అవకాశాలు తగ్గాక లేదా పలు రకాల కారణాల చేత ఆ తర్వాత టెలివిజన్ లోకి వచ్చారు, వస్తున్నారు. ఇలా ఎందరో స్టార్ నటులు సైతం ప్రోగ్రామ్ లకు జడ్జ్ లుగా, హోస్ట్ లు గానే కాకుండా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తూ బుల్లి తెరపై రాణిస్తున్నారు. ఇటీవలే ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి కూడా 'జానకి కలగనలేదు' సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నటి ప్రభా కూడా సరికొత్త ధారావాహికతో మన ముందుకు రానున్నారు. ఇలా ఎందరో సినీ నటులు బుల్లి తెరపైకి వచ్చి సందడి చేస్తున్నారు. అయితే ఇపుడు మరో సినీ సెలబ్రిటీ సీరియల్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
అది మరెవరో కాదు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న గొప్ప నటుడు పోసాని కృష్ణ మురళి.. టాలీవుడ్ లోనే కాదు రాజకీయాల్లోనూ ఈ పేరు ఒక సంచలనం అనే చెప్పాలి. ముక్కుసూటిగా మాట్లాడటం పోసాని స్టైల్.  ఈ మధ్య వై సి పి పార్టీలో చురుగ్గా ఉంటున్న పోసానికి సిఎం జగన్ మోహన్ రెడ్డి గారే స్వయంగా కీలక పదవులకు ఆఫర్ ఇచ్చినా సరే ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఎప్పుడూ సినిమాల్లో ఫుల్ బిజీ బిజీ గా ఉండే ఈ నటుడు... వైసిపికి మద్దతు పలుకుతున్నప్పటి నుండి ఈయనకు సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గాయి అని టాలీవుడ్ వర్గాల్లో వినబడుతోంది.
ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ ప్రత్యర్ధి పార్టీ వారు తమకు కావాలనే అవకాశాలు రాకుండా చేస్తున్నారని పలుమార్లు చెప్పుకొచ్చారు కూడా, అయితే ఇదిలా ఉండగా ఓ ప్రముఖ సీరియల్ లో కీలక పాత్ర కోసం పోసాని కృష్ణ మురళిని అడుగగా ఆయన ఒకే అన్నట్లు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఈయన గతంలో 'బ్రతుకు జట్కా బండి' వంటి పలు టెలివిజన్ షో లకు హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. మరి ఈ వార్త నిజం అయితే బుల్లితెర ప్రేక్షకులకు భలే మజా!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: