అభిమానులకు అనందించే క్షణాలు ఇవే..ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..!!
1940 బ్యాక్డ్రాప్లో రూపొందిన చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 7న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. సుమారు నాలుగు వందల కోట్లకు పైగానే ఈ సినిమాకు ఖర్చు చేసరు మేకర్స్. దీంతో ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పనులను మొదలపెట్టారు మూవీ మేకర్స్.
అయితే ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన "అఖండ" మూవీని చూసిన ఎన్టీఆర్ ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాని తెలియజేసాడు. దీంతో బాబాయి సినిమా పై అబ్బాయి కమెంట్స్ అంటూ నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. అఖండ సినిమాను చూసిన ఎన్టీఆర్ తన ట్వీట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు.." ఇప్పుడే అఖండ సినిమా చూడటం పూర్తయింది. బాబాయి మరో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. బాలా బాబాయికి మరియు అఖండ చిత్ర యూనిట్కి కంగ్రాట్స్. ఇలాంటి విజయాలే అభిమానులకు అనందించే క్షణాలు"..అంటూ ట్వీట్ చేసారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ.. తారక్ ట్వీట్ ను షేర్ చేస్తున్నారు.