'పుష్ప' ప్రీ రిలీజ్ కి నో గెస్ట్స్.. కారణం..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా మొదటిసారి కన్నడ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, మొత్తం శెట్టి మీడియా వారితో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే ఓ లారీ డ్రైవర్ పాత్రను పోషించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 ఇక దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్రయూనిట్ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సుకుమార్ ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే ఈ చిత్రం రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పటికే మీడియా వర్గాల్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. దాని ప్రకారం పుష్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ గెస్ట్ లు  రాబోతున్నారని, అంతే కాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పాన్ ఇండియా హీరో ప్రభాస్ వస్తున్నాడని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇలాంటి వార్తల్లో నిజం లేదని మేకర్స్ చెబుతున్నారు. పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏ గెస్ట్ ని కూడా పిల్వడం లేదట.

ఈ సినిమా ఎటువంటి గెస్ట్ లు లేకుండా సోలో ప్రీ రిలీజ్ జరుపుకుంటుందట.అయితే ఇది తెలుగు వర్షన్ వరకు మాత్రమే అని సమాచారం. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సాంగ్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాలో ఈ సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు చెబుతున్నారు. ఇక డిసెంబర్ 17న తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైజ్ విడుదల కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: