వెల "సిరి ": వెన్నెల సెలవు..!
బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి నుంచి మొదలుకొని ఆయన ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగింది. సిరివెన్నెల పూర్తి పేరు చెంబోలు సీతారామశాస్త్రి ఆయన 1955 మే 20 వ తేదీన విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో గల డాక్టర్ సి వి యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన పదో తరగతి వరకు అనకాపల్లిలోనే చదివి, మిగతా చదువు ఇంటర్మీడియట్ కాకినాడలో పూర్తి చేసి, తండ్రి కోరిక మేరకు ఎంబీబీఎస్లో చేరాడు. ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడంతో ఎంబీబీఎస్లో కొనసాగలేక పోయి మధ్యలోనే ఆపేశారు. పదో తరగతి అర్హతతో బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం రావడంతో కొన్నాళ్ళు రాజమహేంద్రవరంలో ఉద్యోగం కూడా చేశారు.
సోదరుడి ప్రోత్సాహంతో.. జీవితం మలుపు..!
చిన్నప్పటి నుంచే గాయకుడు కావాలనేది సీతారామశాస్త్రి యొక్క కళ. అందుకు తను అర్హుడిని కాదనే విషయాన్ని గ్రహించి, ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితుడైన సిరివెన్నెల తనకు తెలిసిన పదాలతో దేశభక్తి పద్యాలను, గీతాలను రాయడం ప్రారంభించాడు. ఆయనలో మంచి కవి ఉన్నాడు అనే విషయాన్ని ఆయన సోదరుడు గమనించి ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహం సిరివెన్నెలను సినీ రంగం వైపు అడుగులు వేసేలా చేసిందని చెప్పవచ్చు. ఆనాటి అడుగులే ఇప్పుడు వేలాది పాటలకు పూల బాటలు అయ్యాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు బాధాతప్త హృదయాలతో నివాళులు అర్పించి, బరువెక్కిన హృదయాలతో ఇక సెలవు అంటున్నారు.