ట్రెండ్ షురూ.. పుష్ప కోసం సలార్!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో స్టార్ హీరోలు చాలామంది కూడా తమ సాటి హీరోల సినిమా ఫంక్షన్లకు వచ్చి కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఆ విధంగా పెద్ద హీరోలు ఏ మాత్రం ఈగోలకు పోకుండా ఇలాంటి ఫంక్షన్ ల కి వచ్చి తమ హీరోల సినిమాలను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కొంతమంది హీరోల ఫంక్షన్ లకు వెళ్లి వారి సినిమా కు సపోర్ట్ చేయగా ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నాడు.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ హల్చల్ హల్ చల్ చేస్తుంది.  పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 17 వ తేదీన విడుదలకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ము రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.  అల్లు అర్జున్ సమంత తో కలిసి ఈ పాట లో చిందులు వేస్తున్నాడు. ఇక సినిమా దగ్గర పడుతూ ఉండడం తో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను భారీ ఎత్తున ప్లాన్ చేశారు చిత్రయూనిట్.

దేశం లోని ప్రధానమైన నగరాలలో చిత్ర యూనిట్ ప్రచారం చేసేలా ప్రణాళికలు వేసుకున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ప్రభాస్ రాన్న్నారని తెలుస్తుంది. పుష్ప కోసం ప్రభాస్ రావడం అంటే నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి. అంతే కాదు ఇది టాలీవుడ్లో మంచి పరిణామం కూడా.. ఈ సినిమా విడుదలైన ఒక నెల వ్యవధిలోనే ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దానికి అల్లు అర్జున్ ఏమైనా హాజరవుతాడ అందుకే ప్రభాస్ ఈ సినిమాకి ముఖ్యఅతిథిగా వస్తున్నాడా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది ఆర్య ఆర్య-2 తరువాత సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: