'ఆ వార్తల్లో నిజం లేదు'.. పుష్ప టీమ్ క్లారిటీతో షాక్ లో బన్నీ ఫ్యాన్స్..?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరో గా  తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప . టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీ లోనే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసి విడుదలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. అయితే సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన ఓ  చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ విషయం పై ఒక క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

సుకుమార్ రూపొందిస్తున్న పాన్ ఇండియన్ మూవీలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరో గా నటిస్తుండగా రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది.మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి  అల్లుఅర్జున్ నటిస్తున్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సుకుమార్ రూపొందిస్తున్న 'పుష్ప ది రైజ్ పార్ట్ 1'  సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది అన్న విషయం తెలిసిందే.అయితే ఈ నేపధ్యంలో లొనే ప్రమోషన్స్  పనులను వేగవంతం చేశారు.దీని తరువత త్వరలోనే ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా ఎవరు ఊహించని విధంగా నిర్వహించనున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కి కొందరు స్టార్ లని స్పెషల్ గెస్ట్ లుగా పిలవనున్నారు.అయితే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా హాజరవనున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.తాజాగా  గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర సోషల్ మీడియా వేదికగా ఒక విషయాన్ని చెప్పారు...పుష్ప సినిమా ప్రి రిలీజ్ కు ప్రభాస్ రావడం లేదని ...ఈ వార్త ఎ మాత్రం నిజం కాదని ఆయన చెప్పారు.ఇప్పుడు 'పుష్ప' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్  రావడం లేదనే విషయం తెలిసి పోవడంతో ఎంతో నిరసకి గురయ్యారు ప్రేక్షకులు.ఇకపోతే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: