నిర్మాతల గుండెల్లో హడల్ పుట్టిస్తున్న కరోనా వైరస్...

VAMSI
సంక్రాంతి మొదలుకుని సందడి చేసేందుకు స్టార్ హీరోల నుండి చిన్న హీరోల చిత్రాల వరకు విడుదలకు ప్లానింగ్ మొదలెట్టేశాయి. కొన్ని సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయగా మరికొన్ని చిత్రాలు రేపో మాపో ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఇపుడు ఆ వరుస చిత్రాల వివరాలు విషయానికొస్తే, జనవరి 7 న సంక్రాంతి బరిలోకి దిగేందుకు 'ఆర్ ఆర్ ఆర్' మూవీ సిద్ధమయ్యింది అంటూ మేకర్స్ ప్రకటించేశారు. ఒకరు కాదు ఇద్దరు స్టార్ హీరోలు చెర్రీ, తారక్ నటించిన భారీ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి. ఈ మూవీ బిజినెస్ దాదాపు 500 కోట్లు కాగా వసూళ్లు డబల్ అని అంచనాలు ఉన్నాయి.
ఆ తర్వాత జనవరి 12న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానాల చిత్రం 'భీమ్లా నాయక్' రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఇప్పటికే రూ.140 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక ఆ తర్వాత పాన్ ఇండియా హీరో మరో బడా ప్రాజెక్ట్ 'రాధేశ్యామ్' మూవీని జనవరి 14 న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసేశారు.  భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. జనవరి 15 న నాగార్జున, నాగచైతన్యల మూవీ 'బంగార్రాజు' విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా  ఇప్పటికే రూ.40 కోట్లకు పైగా  బిజినెస్ చేసుకుందని తెలుస్తోంది.
ఇలా వరుస బెట్టి బడా చిత్రాలు కొత్త సంవత్సరంలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. 2021 కరోనా మహమ్మారితో తెలుగు సినీ పరిశ్రమ అల్లాడిపోగా 2022 కొత్త సంవత్సరాన్ని టార్గెట్ చేసి వసూళ్ల సునామీ సృష్టించాలని ప్లానింగ్ చేస్తున్న నేపథ్యంలో ఇపుడు కొత్తగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ భయాందోళన కలిగిస్తున్నాయి. ఒకవేళ వైద్య శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం జనవరిలో స్టార్ట్ అయితే ఈ భారీ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటా అన్న అనుమానం ఒక మూల వినిపిస్తోంది. కానీ సమస్య పెద్దది కాకుండా అన్ని అనుకూలించి అనుకున్న ఫలితాలు దక్కాలని కోరుకుంటున్నారు సినీ ప్రేమికులు. ఇప్పటి నుండే నిర్మాతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: