రష్మిక అయినా శర్వా ని కాపాడుతుందా!!

P.Nishanth Kumar
శర్వానంద్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది అని చెప్పవచ్చు.  గత కొన్ని సినిమాలు గా ఫ్లాప్ అందుకోవడం తో అయన కెరీర్ ఏమాత్రం బాగోలేదు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏ జోనర్ లో సినిమా చేసిన ఎంత మంచి కథతో సినిమా చేసిన ఎలాంటి దర్శకుడితో సినిమా చేసిన అది భారీ ఫ్లాప్ అవుతూ వస్తుంది. ఎందుకో కానీ శర్వానంద్ కు బ్యాడ్ లక్ చాలా ఉందని చెప్పాలి. కథ విన్నప్పుడు బాగానే అనిపించిన ఆయన తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ చిత్రం భారీగా ఫ్లాప్ అవుతుంది. అలా ఆయన ఎన్నో అంచనాల మధ్య తీసిన చిత్రం మహా సముద్రం కూడా భారీ ఫ్లాప్ అవడంతో ఒక్కసారిగా ఆయన చాలా డీలా పడిపోయాడు.

మహా సముద్రం సినిమా కంటే ముందు కూడా  ఆయనకు పెద్దగ హిట్ లు లేవనే చెప్పాలి. మంచి దర్శకుడితో చేసినా కూడా ఈ చిత్రం కూడా ఆయనను ఫ్లాప్ నుంచి కాపాడలేకపోయింది. మంచి దర్శకులు యువ దర్శకులతో ఆయన సినిమాలు చేసినా కూడా వారు  ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చని సినిమాలు చేస్తూ వారిని ఎంతో నిరశాపరుస్తున్నారు. దాంతో ఈ సారి తప్పకుండా మంచి సినిమా చేయాలని హిట్టయ్యే సినిమా చేయాలని ప్రేక్షకులు మెచ్చే సినిమా చేయాలని చెప్పి ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా తొలిసారి వీరిద్దరూ తెరపై కనువిందు చేయనున్నారు.

ఏదేమైనా రష్మిక ఎంతోమంది హీరోలకు లక్కీ హ్యాండ్ గా మారి వారికి మంచి విజయాలను ఇవ్వగా రష్మిక మందన ఈ సారి శర్వా కు లక్కీ ఐకాన్ గా మారుతుంది అనేది చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె త్వరలోనే నెంబర్ వన్ స్థానానికి వెళ్లడం ఖాయం. ఆమె ఏ సినిమా చేసినా కూడా అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో ఆమెకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ  సినిమా లో ఆమె పాత్ర నచ్చి ఈ సినిమా చేయగా ఇప్పుడు ఈ చిత్రం తప్పకుండా తనకు మంచి విజయాన్ని చేకూరుతుందని భావిస్తున్నారు. మరి శర్వానంద్ ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలలో ఒక సినిమా ఇది కాగ రష్మిక మందన అయినా ఆయన కెరీర్ను కాపాడుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: