కూతురు అలా అడిగేసరికి కన్నీరు పెట్టుకున్న అమితాబ్..!!
ఇక బాలీవుడ్ లో లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఎప్పటి నుండో బుల్లి తెర పై "కౌన్ బనేగా కరోడ్ పతి" అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అమితాబ్ మంచి నటుడిగానే కాకుండా హోస్ట్గాను ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఏడు పదుల వయస్సు దాటినా..ఫుల్ ఎనర్జిటిక్ గా, ఉత్సాహంగా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఈ బిగ్ రియాలిటీ షో అయిన "కౌన్ బనేగా కరోడ్ పతి" షోకి హోస్ట్ గా దాదాపు 12 సీజన్స్ కంప్లీట్ చేసారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే ప్రపంచ దేశాలని అల్లాడించిన మహమ్మారి కరోనా సమయంలోను షోని ఎక్కడ ఆపకుండా సక్సెస్ ఫుల్గా రన్ చేసారు అమితాబ్.
ఇక రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ తో ఈ "కౌన్ బనేగా కరోడ్ పతి" షో 1000వ ఎపిసోడ్ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. దీంతో శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా బిగ్బీ కుమార్తె శ్వేతా బచ్చన్ షో కి అతిధిగా వచ్చారు. ఆమెతో పాటు మనవరాలు నవ్య నవేలి నంద కూడా ఈ షో పాల్గొనడం గమనార్హం. ఇక ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నింటిలో ది బెస్ట్ మూమెంట్స్ ని ఓ వీడియో రూపంలో ప్లే చేసి చూయించారు. కాగా ఆ వీడియో చూసాక శ్వేతా తన తండ్రి అమితాబ్ను "మీరు ఎలా ఫీల్ అవుతున్నారు డాడీ" అని అడగ్గా.. బిగ్బీ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు. నా ప్రపంచం మొత్తం మారిపోయింది అంటూ బాగా ఎమోషనల్ అవుతారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.