కూతురు అలా అడిగేసరికి క‌న్నీరు పెట్టుకున్న అమితాబ్..!!

VUYYURU SUBHASH
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు సైతం బుల్లితెర పై సందడి చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది లెజండ్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు అందరు బుల్లితెర పై హోస్ట్ గా చేయడానికి ముందుకు వస్తున్నారు. బుల్లి తెర అయిన పారితోషకం కూడా వెండి తెర రేంజో లో బాగానే పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే తెలుగులో చిరంజీవి, నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి వారసుడు రానా, నట సింహం నందమూరి బాలకృష్ణ ఇలా అందరు బుల్లితెర పై తమ స్టైల్లో అలరించారు.
ఇక బాలీవుడ్ లో లెజండరీ యాక్టర్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఎప్పటి నుండో బుల్లి తెర పై "కౌన్ బ‌నేగా కరోడ్ ప‌తి" అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అమితాబ్ మంచి న‌టుడిగానే కాకుండా హోస్ట్‌గాను ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఏడు ప‌దుల వ‌య‌స్సు దాటినా..ఫుల్ ఎనర్జిటిక్ గా, ఉత్సాహంగా ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఈ బిగ్ రియాలిటీ షో అయిన "కౌన్ బ‌నేగా కరోడ్ ప‌తి" షోకి హోస్ట్ గా దాదాపు 12 సీజన్స్ కంప్లీట్ చేసారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే ప్రపంచ దేశాలని అల్లాడించిన మహమ్మారి క‌రోనా స‌మ‌యంలోను షోని ఎక్కడ ఆపకుండా స‌క్సెస్ ఫుల్‌గా రన్ చేసారు అమితాబ్.

ఇక రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ తో ఈ "కౌన్ బ‌నేగా కరోడ్ ప‌తి" షో 1000వ ఎపిసోడ్‌ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. దీంతో శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా  బిగ్‌బీ కుమార్తె శ‍్వేతా బచ్చన్‌ షో కి అతిధిగా వచ్చారు. ఆమెతో పాటు  మనవరాలు నవ్య నవేలి నంద కూడా ఈ షో పాల‍్గొనడం గమనార్హం. ఇక ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్‌ అన్నింటిలో ది బెస్ట్ మూమెంట్స్ ని ఓ వీడియో రూపంలో ప్లే చేసి చూయించారు. కాగా ఆ వీడియో చూసాక శ్వేతా తన తండ్రి అమితాబ్‌ను "మీరు ఎలా ఫీల్‌ అవుతున్నారు డాడీ" అని అడగ్గా..  బిగ్‌బీ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు. నా ప్రపంచం మొత్తం మారిపోయింది అంటూ బాగా ఎమోషనల్ అవుతారు బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: