మహేష్ ప్లాన్ ఎలా ఉంటుంది...?

Sahithya
తెలుగు సినిమా పరిశ్రమలో గతకొన్ని రోజులుగా కష్టాలు పడుతున్న వారిలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. భారీ అంచనాలతో సినిమా విడుదల అయినా సరే ఆ సినిమా వసూళ్ల విషయంలో మహేష్ బాబుని కొన్ని అంశాలు కంగారు పెట్టిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ప్రమోషన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే కాకుండా ప్రమోషన్ బాధ్యతలు అన్నీ కూడా ఆయన సతీమణి నమ్రతా చూసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి మహేష్ భార్య నమ్రత ప్రమోషనల్ కార్యక్రమాలను కాస్త జాగ్రత్తగానే ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు.
మహేష్ బాబు హీరో గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఆశించిన విధంగా ఫలితాన్ని ఇవ్వకపోవడం వసూళ్లు భారీగా లేకపోవడంతో ఇప్పుడు జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. నమ్రతకు సంబంధించి మహేష్ బాబు కూడా అన్ని విధాలుగా సహకరించడమే కాకుండా తమిళనాడుకు చెందిన ఒక సోషల్ మీడియా టీమ్ ని కూడా నియమించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని ప్రమోషన్ వ్యవహారాలు చూడటమే కాకుండా సినిమా విడుదలైన తర్వాత సినిమా రివ్యూలు కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదేవిధంగా సినిమా వసూళ్ల కు సంబంధించిన పోస్టర్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే విధంగా సదరు కాస్త గట్టిగా ప్లాన్ చేస్తోందని గతంలో ఆ టీం తమిళనాడులో ఒక అగ్ర హీరోతో పని చేసిందని ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఆ టీమ్ కోసం దాదాపుగా కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాడు అని అంటున్నారు. దాదాపుగా వీళ్ళతో రెండేళ్లపాటు ఒప్పందం కుదుర్చుకున్నారని కూడా సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే మహేష్ బాబు చేసిన సినిమాలకు సంబంధించిన మరి ఇప్పటి వరకు అన్ని వ్యవహారాలు చూసుకునే సరికి ఇప్పుడు మాత్రం మరో టీంకి మహేష్ బాబు అప్పగించడం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: