బాబాయ్ పై అదిరిపోయే ట్వీట్ చేసిన అబ్బాయ్..!

murali krishna
సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు నటసింహా అయిన నందమూరి బాలకృష్ణ. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నారట.

కెరీర్ ఆరంభం నుంచీ జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వెళ్తోన్నారని తెలుస్తుంది... కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో తనకు బాగా కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారని తెలుస్తుంది. కొద్ది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య సినిమాపై నందమూరి హీరో ఊహించని ట్వీట్ చేశాడని తెలుస్తుంది.ఆ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం.
 
నటసింహా నందమూరి బాలకృష్ణ బడా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమే 'అఖండ' ani తెలుస్తుంది. సింహా మరియు లెజెండ్ తర్వాత వస్తున్న ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తోందట. ఇందులో పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారని ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడని తెలుస్తుంది.

హిట్ కోసం వేచి చూస్తోన్న బాలయ్య 'అఖండ' మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఇందులో భాగంగానే దీని కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నారట. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా నటిస్తున్నారని ఇక ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు సమాచారం. మొత్తంగా దీన్ని ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చని తెలుస్తుంది.
 

'అఖండ' మూవీ నుంచి ఏది విడుదలైనా పేలిపోతోందట గతంలో వచ్చిన ఫస్ట్ టీజర్‌తో పాటు టైటిల్ రోర్ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చిందని ఫలితంగా ఇది ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిందని తెలుస్తుంది .తద్వారా సౌతిండియా రికార్డు బాలయ్య సొంతమైందని సమాచారం.ఇక, ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే!


గ్రాండ్‌గా ఈ7వెంట్.. బన్నీ రాకతో
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'అఖండ' మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారట. దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ గెస్టులుగా వచ్చారట.ఈ వేడుక మెగా, నందమూరి అభిమానులతో కళకళలాడిపోయిందని తెలుస్తుంది.

 
నందమూరి బాలకృష్ణ సినిమా విడుదల అవుతుంటే ఆ కుటుంబానికి చెందిన హీరోలు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారట.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పలుమార్లు బాబాయ్ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఇప్పుడు కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'అఖండ' సినిమాను ఉద్దేశించి ఆ ఫ్యామిలీకి చెందిన కల్యాణ్ రామ్ ట్వీట్ చేశాడట.
 

'అఖండ' సినిమాలోని జై బాలయ్య అంటూ సాగే పాట వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన నందమూరి కల్యాణ్ రామ్ 'జై బాలయ్య.. బాబాయ్ మాంచి ఊపులో ఉన్నాడని ఈ మాస్ జాతరను చూసేందుకు డిసెంబర్ 2 వరకూ వేచి చూడలేకపోతున్నా' అంటూ పోస్ట్ పెట్టాడట.దీంతో నందమూరి అభిమానులు దీన్ని రీట్వీట్లు కొడుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: