జగపతి బాబును గుర్తుపట్టలేదు... ప్రగ్యా జైస్వాల్..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతుండగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణా హీరోయిన్ లుగా నటించారు, ఈ సినిమాలో బాలకృష్ణ రైతుగా అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని  డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది, అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా ఈ రోజు అఖండ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 ఇది ఇలా ఉంటే సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ తాజా గా మీడియా తో మాట్లాడుతూ అఖండ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ... బాలకృష్ణ గారు చాలా సీనియర్, అంతా పెద్ద నటుడి తో నేను ఇప్పటి వరకు నటించలేదు. బాలకృష్ణ గారిని ఇది వరకు రెండు మూడు సార్లు కలిశాను, కానీ ఆయనతో పని చేసే మొదటి రోజు మాత్రం చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను, అంటూ ప్రగ్యా జైస్వాల్ తెలియజేసింది.
అలాగే ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు గురించి మాట్లాడుతూ...
జగపతి బాబు గారిని ఆ గెటప్ లో చూసి నేను మొదటి రోజు గుర్తు పట్టలేదు, జగపతి బాబు గారు పిలవడం తో ఆ తర్వాత గుర్తు పట్టాను, ఇలా ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమా గురించి అనేక విషయాలను తెలియజేసింది. ఇప్పటికే జనాలలో మంచి అంచనాలను క్రియేట్ చేసిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయన్ని సాధిస్తుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: