ఆయన అలాంటి వ్యక్తి దేశంలోనే లేరంటున్న ఆర్జీవి..!!
చంద్రబాబు సతీమణి అవమానించారని పేరుతో.. చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఏడవడం చాలా సిల్లీగా అనిపించిందని రాంగోపాల్వర్మ తెలియజేశాడు. దీంతో తన బాల్యం నాటి సన్నివేశాలను గుర్తు చేశాడని నవ్వుతూ తెలియజేశారు. అలాంటి సమయాలలో ధైర్యం ఉన్న ఏ నాయకుడైన కన్నీరు కార్చరని, ఎన్ని కష్టాలు ఒడిదుడుకులను తట్టుకొని నిలబడతారో వారే అసలైన నాయకులు అని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు భార్య పై చేసిన కామెంట్లను విని ఊరకనే ఉన్నాడు. వారిని అక్కడే కొట్టుకుంటే సంతోషించే వారిని అని చెప్పుకొచ్చారు. కానీ నాలుగు గోడల మధ్య వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అని తెలియజేశాడు. ఇక ఇదే తంతులో జగన్ పై ఎందుకు కామెంట్లు చేయరని ఒక ప్రశ్న అడగగా.. అందుకు సమాధానంగా జగన్ పై నేనెప్పుడూ ఎలాంటి కామెంట్లు చేయను అని తెలియజేశారు. ఎందుకంటే ఆయన ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా కూడా, తన సహనాన్ని కోల్పోలేదు. తన ధైర్యం బలంతోనే ముందుకు సాగదని చెప్పుకొచ్చారు.
తాను ఎక్కువగా ఇష్టపడే నాయకులలో జగన్ కూడా ఒకరని తెలియజేశారు. జగన్ గడిపిన జైలు జీవితాన్ని తన కళ్లారా చూశానని, తన తండ్రి మరణించిన తరువాత.. అన్ని పార్టీలు కుమ్మక్కై ఒంటరిని చేశారని, కానీ ఆయన వాటన్నిటికి కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు హయాంలో కూర ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ.. ఆయన తన ముఖంలో చిరునవ్వుని వదలలేదు.. అలాగే ముందుకి కొనసాగారు ఇలాంటి వ్యక్తి దేశంలోనే లేరని తెలియజేశారు. అందుకే ఆయనపై నేను కామెంట్లు చేయానని తెలిపారు.