తమన్ కామెంట్స్ కు షాక్ లో బాలయ్య అభిమానులు !

Seetha Sailaja
పాతకాలపు సినిమాలలో ఒక మేల్ సింగర్ ఒక లేడీ సింగ‌ర్ క‌లిసి సినిమాలో మొత్తం పాట‌లు అన్ని పాడుతూ ఉండేవారు. అలా పాడినప్పటికీ ఆ పాటలు ఇప్పటికి మేలోడీస్ గా మిగిలిపోయి అందరి హృదయాలలో సుస్థిర స్థాన్నాన్ని ఏర్పరచుకున్నాయి. ఆ త‌ర్వాత  ప్రేక్షకుల అభిరుచి మారడంతో సినిమాలో ఒక్కో పాట‌ను ఒక్కో సింగ‌ర్‌ తో పాడించ‌డం మొద‌లైంది.

ఇప్పుడు ట్రెండ్ మరింత మారిపోవడంతో ఒక పాటనే ఇద్ద‌రు ముగ్గురు పాడే  ట్రెండ్ మొదలైంది. ప్రస్తుత ట్రెండ్ లో ఒక పాటకు సింగర్ తో కలిపి కోర‌స్ పాడే సింగ‌ర్స్‌ ను కూడా క‌లిపితే ఈ సంఖ్య 10 నుంచి 20 వరకు  ఉండవచ్చు కాని ఒక సినిమా కోసం ఏకంగా 120 మంది గాయ‌నీ గాయ‌కులు ప‌ని చేశారంటే  నమ్మలేని పరిస్థితి.  

అయితే ఈ విషయం బోయపాటి బాలకృష్ణల ‘అఖండ’ విషయంలో జరిగింది అని స్వయంగా సంగీత దర్శకుడు తమన్ ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ‘అఖండ’ సినిమా కోసం 120 మంది సింగ‌ర్స్ ప‌ని చేసారట. ఇటీవ‌లే విడుద‌లై అంద‌రినీ ఆక‌ట్టుకున్న ‘అఖండ’ టైటిల్ సాంగ్ కోసం ప‌దుల సంఖ్య‌లో సింగ‌ర్స్ ప‌ని చేసిన‌ట్లు త‌మ‌న్ చెపుతున్నాడు. ఈ సినిమాలోని మిగ‌తా పాట‌ల‌కు కూడ కోర‌స్ సింగ‌ర్స్ చాలమంది అవ‌స‌రం ప‌డ్డార‌ని సినిమాలో ఒక్కో పాట కోసం ఇద్ద‌రు ముగ్గురు ప్ర‌ముఖ గాయ‌నీ గాయ‌కులు ప‌ని చేశార‌ని అలా మొత్తం సింగ‌ర్స్ సంఖ్య 120కి చేరింద‌ని త‌మ‌న్ చెపుతున్నాడు.  

ముఖ్యంగా శివుడి మీద న‌డిచే ‘అఖండ’ టైటిల్ సాంగ్‌ ను శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ పాడితే బాగుంటుంద‌ని ఆయ‌న్ని తీసుకొచి  పాడించామని చెపుతూ ఆ ఒక్క పాట‌ ట్యూనింగ్ కు నెలరోజుల స‌మ‌యం పట్టిందని ఈ పాటకోసం అఘోరా ల బాడీ లాంగ్వేజ్ గురించి ఎంతో రీసెర్చ్ చేసి ఈ సాంగ్ రికార్డ్ చేశామ‌ని త‌మ‌న్ చెప్పిన మాటలు బాలయ్య అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: