అల్లుకుంటున్న మెగా నందమూరి బంధం!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఓ పరిణామం జరుగుతుంది. అది అందరిని ఎంతగానో సంతోషపెడుతున్న ఇంకోవైపు అందరినీ ఎంతో ఆశ్చర్యపరుస్తుంది కూడా. మొదటి నుంచి కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నందమూరి మరియు మెగా కుటుంబాల మధ్య సినిమాల పరం గా నుంచి పోటీ ఉండేది. బహిరంగంగా విమర్శలు చేసుకోకున్నా రాజకీయంగా అప్పుడు ఇప్పుడు కొన్ని విమర్శలు చేసుకున్నారు. ఇక వీరు కలిసి చేసే సినిమాల పరంగా మాత్రం గట్టి పోటీ ఉండేది.

మెగా నందమూరి వారి సినిమాలు ఎంతో పోటీ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. వీరి ఇరువురి కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని అప్పట్లో ఎన్నో వార్తలు రాగా ఇటీవలే వీరి మధ్య అభిప్రాయ బేధాలు ఉంటాయి కానీ విభేదాలు మాత్రం లేవు అని నిరూపణ జరిగింది. ఎలాగంటే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్వహిస్తున్న ఆహా ఓటీటీ సంస్థ లో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాం కి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తుండడం తో ఒక్కసారి వీరి మధ్య పొరపచ్చాలు తొలగినట్లు అయ్యాయి. 

దానికి తోడు తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమాకి అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నాడు అనే వార్త ఇప్పుడు బయటకు రావడంతో వీరి మధ్య అనుబంధం మరింత బలపడుతుందని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాకు ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు అని వార్తలు రాగా ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పగానే అందరూ అభిమానులలో ఒక్కసారిగా ఆశ్చర్యం నెలకొంది. మరి దీని తర్వాత వీరి మధ్య ఎలాంటి అనుబంధం కొనసాగుతుందో చూడాలి.  అఖండ సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం అందించిన ఈ సినిమా కి తమన్ సంగీతం అందించగా ఈ ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: