బాబోయ్, ఇది మాములు దృశ్యం కాదు .... కట్టిపడేసే దృశ్యం .. ?

GVK Writings
ఇటీవల వెంకటేష్, మీనా హీరో హీరోయిన్స్ గా నటించిన దృశ్యం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అంతకముందు మలయాళం లో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తీసిన దృశ్యం కి తెలుగు రీమేక్ గా ఇది తెరకెక్కింది. ఇక రెండు రోజుల క్రితం దృశ్యం సీక్వెల్ గా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన దృశ్యం 2 మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా ఫస్ట్ సీన్ నుండి ఫైనల్ క్లైమాక్స్ సీన్ వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా దర్శకుడు జీతూ జోసెఫ్ సినిమాని ఎంతో అద్భుతంగా తీసారని పలువురు ప్రేక్షకాభిమానులు అభిప్రాయపడుతూ ఆయనని పొగుడుతున్నారు. అలానే అటు ఈ మూవీ కి ఎంతో పాజిటివ్ గా రివ్యూస్ కూడా వస్తుండడంతో దృశ్యం 2 యూనిట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇకపోతే కొందరు ప్రేక్షకులు అయితే సినిమా నిజంగా తమని ఎంతో కట్టి పడేసిందని, తప్పకుండా సినిమా చూసినవారిలో అందరికీ దృశ్యం పూర్తి స్థాయి అనుభూతిని ఇస్తుందని ఇది మాములు దృశ్యం కాదు కట్టిపడేసే దృశ్యం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండడం విశేషం.
సినిమాలో రాంబాబు గా వెంకటేష్ అయితే తన పాత్రకి జీవం పోశారు, కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయనతో కలిసి నటించిన మీనా, నదియా, సంపత్, నరేష్ కూడా ఎంతో ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ కనబరిచారు. మొదటి పార్ట్ అయిన దృశ్యం మూవీ ఒకెత్తు అయితే, ఈ దృశ్యం పార్ట్ 2 మూవీ అంతకుమించి మరింత అద్భుతంగా ఉందని పలువురు వెంకటేష్ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా దృశ్యం 2 సక్సెస్ అటు టాలీవుడ్ వర్గాల్లో కూడా మంచి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కూడా అందించినది అని చెప్పకతప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: