వామ్మో... ఎన్టీయార్ స్పీడే స్పీడు... ?

Satya
టాలీవుడ్ హీరోలు ఇపుడు పూర్తిగా మారిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాలంతో పాటు పోటీ పడుతున్నారు. కరోనా విలువైన కాలాన్ని తీసుకుపోయింది. ఆ లోటుని భర్తీ చేసుకునేందుకు హీరోలు పడుతున్న తపన అంతా ఇంతా కాదు.
ఇదిలా ఉంటే టాలీవుడ్ లో జూనియర్ లెక్క వేరేలా ఉంది. ఆయన ట్రిపుల్ ఆర్ మూవీతో 2022 జనవరి 7న సందడి చేయబోతున్నారు. ఆ తరువాత కొరటాల శివతో మూవీ చేస్తున్నాడు. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో పాటు మెసేజ్ ని కూడా మిక్స్ చేసి ఉంటుందని టాక్. జనతా గ్యారేజి మూవీ తరువాత తారక్, శివ చేస్తున్న మూవీ ఇది కావడంతో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటికే పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్న కొరటాల సెట్స్ మీద జూనియర్ వచ్చిందే తడవుగా షూటింగ్ పరుగులు పెట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక  జూనియర్ ఈ మూవీని నాన్ స్టాప్ గా చేస్తూ సమ్మర్ నాటికి షూటింగ్ ముగించాలని చూస్తున్నాడుట. అంటే ఈ మూవీ వచ్చే ఏడాది కి ఫ్యాన్స్ ముందుకు రావడం ఖాయం. ఈ మూవీ ఇలా ఉండగానే కేజీఎఫ్ ఫ్రేమ్ ప్రశాంత్ నీల్ తో మరో మూవీకి జూనియర్ కమిట్ అయ్యాడు.
ప్రశాంత్ నీల్ తో కొరటాల మూవీ అయిన వెంటనే షూటింగ్ మొదలెట్టేస్తాడని అంటున్నారు. అంటే ఆ మూవీ కూడా శరవేగంగా పూర్తి చేసి 2023కి థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నాడు అన్న మాట. మొత్తానికి ఎన్టీయార్ స్పీడ్ చూసిన వారు వామ్మో అంటున్నారు. అంతే కాదు, ఆయన ప్లానింగ్ కూడా అదుర్స్ అంటున్నారు. ఈ రెండు సినిమాలు కంఫర్మ్ గా ఉండగానే మిగిలిన మూవీస్ ని కూడా జూనియర్ లైన్ లో పెట్టడానికి డిస్కషన్స్ చేస్తున్నాడుట.మొత్తానికి ఏడాదికి రెండు సినిమాలతో జూనియర్ సందడి చేయడం ఖాయమని అంటున్నారు. ఇక పండుగే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: