అక్కినేని కాంపాండ్ లోకి అడుగుపెట్టిన సమంత.. ఎందుకో తెలుసా..?

Anilkumar
అక్కినేని నాగచైతన్య ను ప్రేమ  వివాహం చేసుకున్న సమంత ఇటీవల నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. చైతు తో విడాకులు తీసుకున్న తర్వాత ఫుల్ జోష్ లో ఉంది ఈ భామ. వచ్చిన ప్రతి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది సామ్. తన కెరియర్ తో పాటు తన ఫిట్నెస్ కోసం కూడా అనేకమైన జాగ్రత్తలు పాటిస్తోంది. ఇకపోతే చేతితో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది సమంత. తన ప్రతీ లేటెస్ట్ న్యూస్ తో తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. ఇకపోతే చైతు సామ్ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం మాత్రం ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు.

 విషయానికొస్తే అక్కినేని అఖిల్ తో విడాకులు తీసుకున్న తర్వాత నుండి వారితో టచ్ లో లేని సమంత ఇటీవల అక్కినేని కాంపౌండ్ లోకి అడుగు పెట్టిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అన్నపూర్ణ స్టూడియోస్కు ఇటీవల సమంత వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విడాకుల తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ కు సమంత రావడం మొదటిసారి. అయితే సమంత ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది అయితే సమంత ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చినట్లు సమాచారం.

 అయితే సమంత నటించిన ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నాయి. ఇటీవల నాగ చైతన్య పుట్టిన రోజున చైతు కి విష్ చేయకుండా ఉండడమే కాకుండా అదేరోజు తన కుక్క పిల్ల బర్తడే సెలబ్రేషన్స్ చేసింది దీనిపై ఫైర్ అవుతున్నారు చైతు ఫ్యాన్స్. ఇకపోతే సమంత అల్లు అర్జున్ రష్మిక మందన కలిసి నటిస్తున్న పుష్ప సినిమాలో ఒక మంచి ఊపున్న సాంగ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం సమంత ఏకంగా కోటిన్నరకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ సాంగ్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని తెలుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగు మెరవడం సమంత కెరీర్లో ఇదే మొదటిసారి కావడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: