టాలీవుడ్లో ఎక్కువ రోజుల పాటు షూటింగ్ సాగిన సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చేది 'బాహుబలి' అని చెప్పవచ్చు.రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రరాజానికి హీరోలు ప్రభాస్ మరియు రానాతోపాటు చాలామంది నటులు వందల రోజుల కాల్షీట్స్ ఇచ్చారని తెలుస్తుంది.
ముఖ్యంగా ప్రభాస్ రెండు పార్టులు విడుదలయ్యేంత వరకు వేరే సినిమాకు కాల్షీట్లు ఇవ్వలేదని సమాచారం.అలా ప్రభాస్ కెరీర్లో అత్యధిక రోజులు ఓ సినిమా కోసం పని చేశాడు అంటే అది 'బాహుబలి'నే అని చెప్పవచ్చు.అయితే ఇప్పుడు ఆతర్వాత హయ్యస్ట్ కాల్షీట్లు ఓ సినిమాకు ఇస్తున్నాడని తెలుస్తుంది.
ఒకప్పుడు ప్రభాస్ వరుస సినిమా చేసేవాడు కానీ… ఇప్పుడు అలా కుదరట్లేదు.పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ వచ్చాక ప్రభాస్ సినిమాల లైనప్ స్ట్రాంగ్ అవుతా వస్తోందని తెలుస్తుంది.ఈ క్రమంలో ప్రభాస్ సినిమా డేట్స్ కేటాయించడం చాలా కష్టం ఉందని తెలుస్తుంది. దొరికినప్పుడు సీన్లు తీసేద్దాం అనుకుంటున్నారట దర్శకులు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ ఓ సినిమా కోసం ఏకంగా 200 రోజులు కాల్షీట్లు కేటాయించాడంటున్నారట అవును అది కూడా మన సినిమానే అని సమాచారం.
నాగ్ అశ్విన్ దర్శకుడుగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె' (వర్కింగ్ టైటిల్) కోసమే ఈ 200 రోజుల కాల్షీట్స్ ప్రభాస్ కేటాయించాడని సమాచారం. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా చాలా ప్రతిష్ఠాత్మకంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని తెలుస్తుంది.అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పదుకొణె లాంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారని తెలుస్తుంది.దీంతో షూటింగ్ విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా… గంపగుత్తగా అన్ని కాల్షీట్లు ఇస్తున్నాడని సమాచారం.. సుమారు 300 కోట్ల బడ్జెట్తో రూపొందుతోందంటున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఎప్పుడు మొదలు అనే విషయంలో త్వరలో స్ఫష్టత వస్తుందంటున్నారని తెలుస్తుంది.మరి చూడాలి ప్రభాస్ అంతగా ఆసక్తి చూపిస్తున్న సినిమా ఏ విధంగా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో. బాహుబలిని మించి ఉంటుందో లేక బాహుబలిని క్రాస్ చేయలేక పోతుందో చూడాలి మరి..