కధ అడ్డం తిరిగిందిగా ..అక్కినేని మనవుడు దెబ్బైపోయాడే..?

VUYYURU SUBHASH
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. ఏదో అయిపోతాం అని వచ్చిన వాళ్ళు ఎటు కాకుండా అయిన వాళ్ళు కొందరైతే..హిట్ సినిమాలు పడిన క్రేజీ ఛాన్సులు వచ్చిన సరైన నిర్ణయం తీసుకోకుండా లైఫ్ ను పెడదారిలో పెట్టిన వాళ్ళు చాలా మందే ఉన్నారు ఇండస్ట్రీలో. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత ఇటివల భర్త నాగ చైతన్య కు విడాకులు ఇవ్వడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.
అసలు ఇలా జరుగుతుందని ఆమె కూడా ఊహించి ఉండదు అనుకుంటా. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అసలు ఎందుకు విడిపోయిందో ఇప్పటికి మిలియన్స్ డాలర్ ప్రశ్న గా మిగిలిపోయింది. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. మొదట కలిసి బ్రతకాలు అనుకున్నారు. ఆ తరువాత విడిపోవాలి అని డిసైడ్ అయ్యారు. ఆ తరువాత వచ్చే పరిణామాలను వాళ్ళే ఫేస్ చేయాలి. విడిపోయిన తరువాత నాగ చైతన్య సమంత వేరు వేరుగా వాళ్ల జీవితాలను ముందుకు తీసుకెళ్తూ హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్లను ఎంతగానో ఆరాధించే అభిమానులే ఎటూ కాకుండాపోయారు.
నిజాని ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం..విడాకుల తరువాత నాగ చైతన్య చాలా సైలెంట్ అయిపోయారు. అసలు మీడియా ముందుకే రావడం లేదు. సమంత కూడా మీడియా కంట కనపడకుండా తప్పించుకుంటున్నా..సోషల్ మీడియాలో డైలీ ఏదో ఒక్క పోస్ట్ పెట్టి..న్యూస్ ఛానల్లో హైలెట్ గా నిలుస్తుంది. కానీ నాగచైతన్య ఊసే లేదు. ఎక్కడొ ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడు అంటున్నారే కానీ దాని పై అధికారిక ప్రకటన అయితే లేదు. సమంత మాత్రం జాలీగా నాగచైతన్యతో గడిపన అదే ఇంట్లో ఉంటూ వరుస సినిమాలకు పచ్చ జెండా ఊపుతుంది. నిజానికి విడాకులు తరువాత అందరు సమంత సినీ కెరీర్ క్లోజ్ అయ్యిపోయింది అనుకున్నారు..కానీ ఇక్కడ సమంత జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. నాగ చైతన్య నే ఏటు కాకుండా సైలెంట్ అయ్యిపోయాడు అంటున్నారు పలువురు ప్రముఖులు. ఇక రీసెంట్ గా  సుకుమార్ కాంబినేషన్   లో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న "పుష్ప"మూవీలోను ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా లో అమ్మడు ఐటెం  సాంగ్ చేయబోతుంది. దీని కోసం సమంత 2కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: