బాలయ్య కు అల్లుడు కావాల్సిన చైతూ.. కానీ చివరికి ఏం జరిగిందంటే..?

Anilkumar
నందమూరి నట సింహం బాలకృష్ణ కు ఇద్దరు కూతుళ్లు  అయిన బ్రాహ్మీని, తేజస్విని.. వారిద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. అయితే బాలకృష్ణ పెద్ద కూతురు ని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి ఇచ్చి వివాహం జరిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. రెండో కూతురు తేజస్విని కి కూడా వివాహం జరిగిపోయింది ఈ వివాహం కంటే ముందు బాలకృష్ణ ఒక హీరో కి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాడట. ఆ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. హీరో ఎవరంటే అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగ చైతన్య. అయితే అప్పట్లో లో బాలయ్య ఇంకా అక్కినేని నాగేశ్వరరావు మంచి స్నేహితులట. 

ఆ చనువుతోనే నాగార్జున ఇంకా బాలకృష్ణ  వియ్యం అందుకోవాలని అనుకున్నారట. ఇరు కుటుంబాలు కలిసి చైతన్య ఇంకా తేజస్విని వివాహం జరిపించాలని మాట్లాడుకున్నారట కూడా. కానీ ఇంతలోనే చైతు లైఫ్ లోకి అనుకోకుండా సమంత రావడం జరిగింది. దీనితో బాలయ్య అనుకున్నదంతా ఫ్లాప్ అయింది. అయితే వీరిద్దరి ప్రేమ ఏం మాయ చేసావే సినిమా నుండి మొదలైంది. దీంతో మాట వెనక్కి తీసుకున్న బాలయ్య వైజాగ్ గీతం సమస్త కి చెందిన శ్రీ భరత్ కి తేజస్వినికి పెళ్లి చేశారు. బాలయ్య అల్లుడు కాలేకపోయినా నాగచైతన్య సమంతతో దాదాపుగా ఏడేళ్ల ప్రేమ లో ఉన్నాడు వీరి 7 ప్రేమ తర్వాత 2017 లో పెద్దలను ఒప్పించి గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు చైతు ఇంకా సామ్.

 ఎంతో చూడముచ్చటగా ఉండే వీరిద్దరూ పెళ్లి కొన్ని సంవత్సరాలు కాకముందే విడాకులు తీసుకోవడం అందరినీ షాక్ కి గురిచేసింది. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో ఇక్కడికే ఎండ్ కార్డ్ వేశారు చైతు ఇంకా సామ్. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఇప్పటికే సమంత శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసి తెలుగులో మరో రెండు ప్రాజెక్టులు తో పాటు బాలీవుడ్ లో కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు చైతూ కూడా లవ్ స్టోరీ సినిమా తర్వాత థాంక్యూ, బంగార్రాజు సినిమాలతో బిజీగా ఉన్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: