మెగా అక్కినేని హీరోల కాంబో ఇప్పటికీ సెట్ అయ్యింది..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగా మరియు అక్కినేని హీరోలకు మధ్య ఎంతో అనుబంధం ఉంది. వీరిరువురు కలిసి నటించే సినిమాల కోసం వారి వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి మరియు అక్కినేని నాగేశ్వరరావు లతో కలిసి కొన్ని సినిమాలలో నటించగా నాగార్జున చిరంజీవి కలిసి నటించే సినిమాలు చాలా తక్కువగా వచ్చాయని చెప్పవచ్చు. ఒకటి రెండు సినిమాలలో గెస్ట్ రోల్స్ లో నటించిన ఈ ఇద్దరు హీరోలు మాత్రం ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు.

దాంతో వీరిద్దరి మధ్య సినిమా రావాలనే అభిమానుల కోరిక కలగానే మిగిలిపోయింది. అయితే ఇప్పటి తరంలో అక్కినేని వారసులు మరియు మెగా వారసులు తెరపై మంచి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అక్కినేని వారసులుగా నాగచైతన్య అక్కినేని అఖిల్ వచ్చి సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ పోతుఉండగా మెగా కుటుంబం నుంచి కూడా కొంతమంది హీరోలు వచ్చి మంచి సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఆ విధంగా నందమూరి అక్కినేని మరియు మెగా కుటుంబాల మధ్య హీరోలు కలసి ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం అవుతుంది.

అక్కినేని అఖిల్ మరియు సాయి ధరమ్ తేజ్ ల కాంబో లో ఓ సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ రెండు కుటుంబాల హీరోల నుంచి సినిమా రావడం తెలుగు పరిశ్రమకు ఎంతో మంచి పరిణామం అని చెప్పాలి. ప్రస్తుతం వీరిద్దరూ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇటీవలే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటు సాయి ధరమ్ తేజ్ కూడా ఓ నూతన దర్శకుడు తో సినిమా చేస్తున్నాడు.
 మరి ఈ రెండు సినిమాల తరువాత వీరు కలిసి నటిస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: