ఆన్ స్థాపబుల్ కి లేడీ గెస్ట్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో టెలికాస్ట్ అవుతున్న  ఆన్ స్థాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే రెండు ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న ఈ టాక్ షో కు మొదటి ఎపిసోడ్ గెస్ట్ లుగా మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి విచ్చేశారు. ఆ తర్వాత రెండవ ఎపిసోడ్ గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని వచ్చాడు. వీరితో అనేక విషయాలను ముచ్చటిస్తూ అనేక ఆటలను ఆడించి  సరదాగా షో ను బాలకృష్ణ ముందుకు సాగించాడు. ఇప్పటి వరకు బాలకృష్ణ ఏ టాక్ షో లకు హోస్ట్ గా  వ్యవహరించక పోయినప్పటికీ ఆన్ స్థాపబుల్ తో మాత్రం జనాలను చాలా బాగా అలరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ స్ట్రీమింగ్  అవుతూ వచ్చిన ఈ టాక్ షో లో ఈ శుక్రవారం మాత్రం ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాలేదు, దానికి ప్రధాన కారణం బాలకృష్ణ చేతికి సర్జరీ కావడం అని తెలుస్తోంది.

అయితే గత కొన్ని రోజుల వరకు ఆన్ స్థాపబుల్ షో కు మూడవ గెస్ట్ గా విజయ్ దేవరకొండ రాబోతున్నాడు అనే వార్తలు బయటకు వచ్చాయి, అయితే తాజా గా ఆన్ స్థాపబుల్ టాక్ షో కు మూడవ గెస్ట్ గా నటి మరియు పొలిటికల్ లీడర్ రోజా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ, రోజా కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు, వీరిద్దరి మధ్య ఇప్పటికి కూడా మంచి స్నేహం ఉంది. ఈ మధ్య కూడా రోజా జబర్దస్త్ షో లో భాగంగా బాలకృష్ణ కు ఫోన్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇలా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా రోజా ఆన్ స్థాపబుల్ షో కి  గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తుంది, మరి ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: