అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్..!!

Anilkumar
టాలీవుడ్ అప్ కమింగ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తికేయ ఒకరు. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఎక్స్100'  సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన కార్తికేయ.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించినా అవి ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేకపోయాయి. కానీ ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు కార్తికేయ. ఇదిలా ఉంటే తాజాగా కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు అయిన లోహిత రెడ్డి ని కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, తనికెళ్ల భరణి, అల్లు అరవింద్, దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో పాటూ...

 మరి కొందరు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో కార్తికేయ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో మన పెళ్లి కొడుకు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్‌లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు.ఇక  పెళ్లికూతురు లోహిత కూడా బంగారు రంగు దుస్తుల్లో, వాటికి తగ్గ జ్యూవెలరీలో మెరిసింది. కార్తికేయ హీరో కాకముందు వరంగల్ ఎన్ఐటిలో విద్యార్థిగా ఉన్నప్పుడు లోహిత తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2012వ సంవత్సరంలో లోహిత కు ప్రపోజ్ చేశాడు కార్తికేయ. కానీ తాను హీరో అయ్యాకే మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే తాను హీరో అవడానికి ఎంత కష్టపడ్డాడో.. తన ప్రేమను గెలిపించుకోవడానికి కూడా అంతే కష్టపడ్డాడు.

 కార్తికేయ ఫైనల్ గా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా నిలదొక్కుకున్న క పెద్దలను ఒప్పించి లోహిత ను పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఇక కార్తికేయ సినిమాల విషయానికొస్తే.. తాజాగా 'రాజా విక్రమార్క' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ప్రస్తుతం తమిళ  స్టార్ హీరో అజిత్ 'వాలిమై' సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ యంగ్ హీరో...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: