బాలయ్య కోసం ఎన్టీఆర్.. నందమూరి అభిమానుల ఆశ నెరవేరేనా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్ లు తెరపై చూడాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు మన ప్రేక్షకులు. ఆ విధంగా తెరపైన బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ ను చూసి తరించి పోవాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే అది ఇప్పటి వరకు సాధ్య పడలేదు కానీ భవిష్యత్తులో మాత్రం సాధ్య పడుతుందేమోనని ఎదురుచూస్తున్నారు.  ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై నందమూరి అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకోగా డిసెంబర్ లో ఈ సినిమా విడుదల అవుతుండటంతో ఒక్కసారిగా నందమూరి అభిమానుల్లో ఎనలేని సంతోషం నెలకొంది. మాస్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన హీరో ల మాస్ ను చూపించిన విధంగా ఏ దర్శకుడు టాలీవుడ్ లో చూపలేడు. దానికితోడు వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో చిత్రం కావడం తో తప్పకుండా ఈ సినిమా వాటికి మించిన హిట్ అవుతుందనే నమ్మకాన్ని అందరూ వ్యక్తపరుస్తూ ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు ఎంతగానో సంతోషం వేస్తుంది. ఇకపోతే గెస్ట్ గా ఎన్టీఆర్ రాబోతున్నాడు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. బాబాయి అబ్బాయి కలిసి ఒక సినిమాలో నటించాలని అభిమానులందరూ దాని కోసం ఎంతగానో ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఒకే వేదికపై వీరు కలిసి ఉండడం కూడా వారిలో ఎంతో సంతోషాన్ని నెలకొల్పుతుంది. ఏదేమైనా హరికృష్ణ మరణం సమయంలో వీరిద్దరూ కలిసి ఒక ఫ్రేమ్ లో కనబడగా ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒకే ఫ్రేమ్లో కనిపించి నందమూరి అభిమానులను ఖుషీ చేయానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: