ఎన్టీఆర్, మహేష్ కాంబోలో మల్టీస్టారర్ వస్తే బాక్సాఫీస్ షేకే..!!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. అగ్ర హీరోలు కూడా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు లాంటి హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే అభిమానులు కూడా కొన్ని కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి కాంబినేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ల కాంబో కూడా ఒకటి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్, మహేష్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

 గతంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే.ఇక మహేష్ బాబు గతంలో వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు అనే మల్టీస్టారర్ సినిమాలో నటించాడు.అటు ఎన్టీఆర్ కూడా మంచి కథ దొరికితే మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కలయిక లో మల్టీస్టారర్ సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్, మహేష్ ఇద్దరూ కూడా వరుస విజయాలతో టాలీవుడ్ లో అగ్ర స్థానాల్లో కొనసాగుతున్నారు. అలాంటిది వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే కచ్చితంగా అది బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోందని చెప్పొచ్చు.

 మరి భవిష్యత్ లో వీరి కలయికలో వచ్చే మల్టీస్టారర్ ని సినిమాని ఏ డైరెక్టర్ తెరకేక్కిస్తాడా చూడాలి ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందేవచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదల కానుంది. ఇక దీని అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్.డిసెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: