సొంత బ్యానర్లో కొత్త సినిమా స్టార్ట్ చేసిన కీర్తి సురేష్..!

Pulgam Srinivas
మలయాళ ముద్దు గుమ్మ కీర్తి సురేష్ రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో కీర్తి సురేష్ కు టాలీవుడ్ లో క్రేజీ సినిమా ఆఫర్లు కూడా దక్కాయి. అందులో భాగంగా ఈ బ్యూటీ నటించిన మహానటి సినిమా కు గాను కీర్తి సురేష్ కు ఎనలేని పేరు ప్రతిష్టలు తగ్గాయి. ప్రస్తుతం కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కీర్తి సురేష్ మరో కొత్త సినిమాను ప్రారంభించింది. వాశి అనే టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకు కీర్తి సురేష్ తల్లిదండ్రులు నిర్మాతలు. మలయాళం లో రూపొందబోయే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.

 వాశి మూవీ లో  వర్సటైల్ టొవినో థామస్ హీరోగా నటించనున్నారు. ఈయన కు జోడి గా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. విష్ణు జి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. నవంబర్ 26 వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సొంత బ్యానర్ లో సినిమా చేస్తుండటం పై కీర్తి సురేష్ సోషల్ మీడియా లో సంతోషం వ్యక్తం చేశారు. ఇది ల్లా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణులు ఇతర నటీనటుల గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా తెరకెక్కిన పెద్దన్న సినిమాలో రజనీకాంత్ కు చెల్లెలు గా నటించిన కీర్తి సురేష్ ప్రస్తుతం మెగాస్టార్ హీరో గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా లో కూడా చిరంజీవి కి చెల్లెలు గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: