NTR 30 : తారక్ లేకుండానే షూటింగ్..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవి తో 'ఆచార్య' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గత మూడేళ్లుగా ఈ సినిమాకే పరిమితం అయిపోయాడు కొరటాల శివ. దానికి కారణం కరోనా మహమ్మారి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వలన ఆచార్య సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక 2022 ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదలను ఖరారు చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు కొరటాల శివ. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తవడంతో తన తర్వాత ప్రాజెక్ట్ ఎన్టీఆర్ సినిమా పనులపై దృష్టి సారించాడు ఈ దర్శకుడు.

 ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ఇటీవల ఎన్టీఆర్ జిమ్ చేస్తున్న సమయంలో ఆయన చేతి వేలికి గాయం అవడం వల్ల ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ కి మళ్లీ బ్రేక్ లు పడ్డట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ సినిమా షూటింగ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సెట్స్ లోకి అడుగు పెట్టే లోపు ఈ సినిమాలో నటిస్తున్న ఇతర ప్రధాన తారాగణం నటించే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నారట.

ఎందుకంటే ఇటీవల తాను తెరకెక్కించిన ఆచార్య సినిమా షూటింగ్ అంతకంతకు ఆలస్యం అవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయంలో జరగకూడదనే కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు వీలైనంత తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ని పూర్తి అయ్యేలా కొరటాల శివ ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది దసరా బరిలో ఎన్టీఆర్ కొరటాల సినిమా విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ తో పాటు మరో నిర్మాణ సంస్థ ఈ సినిమాలో భాగం కానున్నట్లు సమాచారం. ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది.ఇక ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: