కొరటాల శివ ప్రయోగం వర్కౌట్ అయ్యేనా!!

P.Nishanth Kumar
అపజయం లేని దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఆయన మిర్చి సినిమా తో దర్శకుడిగా మారి ఇప్పటివరకు ఒక్క సినిమా తో కూడా ఫ్లాప్ ను అందుకోలేదు. దీంతో ఆయనకు అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా ను చేయగా అది విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి లో ఈ సినిమా విడుదల అవుతుంది.రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా లో కీలక పాత్ర పోషిస్తుండగా ఈ సినిమా పై మెగా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే కొరటాల శివ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో చేయడానికి ఫిక్స్ చేసుకున్నాడు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతు ఉండగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబో లో జనతా గ్యారేజ్ అనే సినిమా రాగా ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో వీరి కాంబో లో మరో సినిమా కోసం డిమాండ్ పెరిగిపోగా ఆ సినిమా ఇంత త్వరగా సెట్ కావడంతో ఒక్కసారిగా ఇద్దరి అభిమానుల్లో ఎంతో సంతోషం నెలకొంది. 

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత కొరటాల శివ  మల్టీస్టారర్ సినిమా చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో పెద్ద హీరో లు మల్టీస్టారర్ సినిమాలు చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా చేశారు కూడా.. దాంతో కొరటాల శివ అలానే పెద్ద హీరో లతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ హీరోలు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆచార్య తర్వాత ఎన్టీఆర్ సినిమా చేస్తుండడం తో ఈ సినిమాకు సంబందించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: