ఇక పై అలా చేయను..అనుష్క సంచలన నిర్ణయం..!!

VUYYURU SUBHASH
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అందరి మనసులు కొల్లగొట్టిన  అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం గ్లామరస్ రోల్స్ నే కాకుండా..ప్రత్యేకమైన పాత్రలలో నటిస్తూ తనలోని టాలెంట్ ను యావత్ ప్రపంచానికి తెలియజేసి టాలీవుడ్  స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన అందంతో..తన నటనతో  ఎంతోమందిని అలరించిన ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆమె కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా వచ్చిన "అరుంధతి" సినిమా ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ టాలీవుడ్ జేజమ్మ.
15 ఏళ్ల క్రిందట ‘సూపర్’ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన బాహుబలి లో ప్రభాస్ కు జోడిగా నటించి  దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. తద్వారా బాహుబలి మూవీతో  గ్లోబల్ స్టార్ గా మారిపోయింది స్వీటీ. ఎప్పుడు డిఫరెంట్ గా ఆలోచించే అనుష్క.. సినిమాలో నటించే పాత్రల్లో కూడా అదే స్పెషాలిటీని కోరుకుంటుంది. ఈ క్రమంలోనే " సైజ్ జీరో" అనే సినిమాలో నటించి అందరికి షాక్ ఇచ్చింది. సినిమా కోసం ఏ హీరోయిన్ చేయలేని పని చేసి అందరి దగ్గర శభాష్ అనిపించుకుంది. "సైజ్ జీరో" సినిమా కోసం ఆమె దాదాపు 12 కెజీలు పైగానే బరువు పెరిగిందట.
అయితే ఆ సినిమా అనుకునంత సక్సెస్ ఇవ్వలేకపోయింది.ఇక ఈ సినిమాకోసం బరువు పెరిగిన అనుష్క ను చూసి నిర్మాతలు డైరెక్టర్లు ఆమెను దూరం పెట్టారు. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. ఇక అనుష్క మళ్ళీ సినిమాల కోసం బరువు తగ్గే పనిలో  పడిందట.  మునపటిలా సన్నగా, నాజూగ్గా మారేందుకు తెగ కష్టపడుతుందట. ఇందులో భాగంగానే బయట ఫుడ్స్ అన్నీ బంద్ చేసిందట. నూనే టోటల్ గా మానేసిందట. అంతేకాదు స్లిమ్‌గా  కనిపించేందుకు వాటర్ ఎక్కువ తీసుకుంటుందట. అంతేకాదు ఎంత బిజీగా ఉన్నా కానీ రాత్రి 8 లోపే డిన్నర్‌ను కంప్లీట్ చేస్తుందట. డైట్ కంట్రోల్ తో పాటు ఖచ్చితంగా రోజు యోగా, ఎక్సర్‌సైజులు క్రమం తప్పకుండా చేస్తోందట. మరి చూడాలి స్వీటీ ఎంత  మేర సక్సెస్ అవుతుందో..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: