స్వీటీ మళ్లీ బిజీ అయిపోతుందా..?
అనుష్కకి 'నిశ్శబ్ధం' తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. పెరిగిన బరువుతో అనుష్క గ్లామర్ తగ్గిపోయిందనే విమర్శలు వచ్చాయి. దీనికితోడు వెయిట్ తగ్గాలని అనుష్క చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో స్వీటీ సినిమాలకి దూరమవుతుందని, కెరీర్ క్లైమాక్స్కి చేరిందనే కామెంట్స్ వినిపించాయి. అనుష్క గురించి ఆమె ఫ్యాన్స్ కూడా మరిచిపోతోన్న టైమ్లో యువి క్రియేషన్స్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. స్వీటీ బర్త్డే సందర్భంగా ఈమెతో సినిమా అనౌన్స్ చేసింది. పి. మహేశ్ బాబు దర్శకత్వంలో అనుష్కతో సినిమా నిర్మిస్తున్నామని ప్రకటించింది. ఇక ఇంతకుముందు స్వీటీ యువి క్రియేషన్స్లో 'మిర్చి, భాగమతి' సినిమాలు చేసింది.
యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్కి ప్రభాస్కి మంచి రిలేషన్ ఉంది. యువి బ్యానర్ డార్లింగ్కి సొంత సంస్థ లాంటిదని అనుకుంటున్నారు సినీజనాలు. ఇక ప్రభాస్కి, అనుష్కకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దీంతో జేజమ్మకి కూడా యువి క్రియేషన్స్ ఓన్ బ్యానర్లా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
మొత్తానికి బరువు పెరిగిపోయి.. తగ్గించుకునేందుకు తెగ కష్టపడిపోతున్న అనుష్క మళ్లీ సినిమల్లో బిజీ కానుందనే టాక్ నడుస్తోంది. మరి జేజమ్మ ప్రేక్షకులను వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతుందో లేదో మరి. స్వీటీని వెండితెరపై చూసి చాలా రోజులయిందనీ ఇప్పుడు ఆమె ఎలా ఉందో ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. ఒక్కసారి కనిపిస్తే బాగుండని మనసులో అనుకుంటున్నారు. చూద్దాం.. అనుష్క మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతుందో లేదో. అప్పటి క్రేజ్ ను మళ్లీ కంటిన్యూ చేస్తుందో లేదో.