జబర్దస్త్ షో నుండి రోజా తప్పుకోవడానికి అసలు కారణం ఇదే..లీకైన షాకింగ్ మ్యాటర్?

VUYYURU SUBHASH
 జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను మంచి క్రేజ్ తెచ్చుకున్న కామెడీ షో. ఈ షో ఎంతోమంది ప్రజలను కడుపుబ్బా నవ్వించడమే కాదు..చాలా మందికి లైఫ్ కూడా ఇచ్చింది. ఎంతో మంది కమెడియన్స్ ఈ షో ద్వారానే గుర్తింపు తెచ్చుకుని..బుల్లితెర మీద నుండి వెండి తెర మీద ఆఫర్స్ కొట్టేసారు. షకలక శంకర్,హైపర్ ఆది, సుడిగాలి సుధీర్,గెటర్ శ్రీను, రాం ప్రసాద్..ఇలా చాలా మంది ఈ షో ద్వారా పాపులర్ అయ్యారు.
ఈ షో ద్వారా కమెడియన్స్ నే కాదు.. జబర్ధస్త్ లో చేసే జడ్జిలు కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. జబర్ధస్త్ జడ్జి అనగానే మనకు గుర్తు వచ్చే పేరు రోజా. ఒక్కప్పుడు వెండి తెర పై తన సత్తా చాటి..ఈ షో ద్వారా బుల్లితెర మీద కూడా తానేంటో నిరూపించుకుంది. ఓ పక్క రాజకీయాలో బిజీగా ఉంటూ..మరో వైపు సినిమాలో తల్లి పాత్రలు పోషిస్తూ.. కెరీర్ బిజీగా ఉన్నా కూడా రోజా మాత్రం జబర్ధస్త్ వదలలేదు. కొన్ని సంధర్భాల్లో కొన్ని  ఎపిసోడ్స్ మిస్ అయినా కానీ మళ్ళి ఆమె ప్లేస్ ను భర్తీ చేసుకుంటూ వచ్చేది.
అయితే తాజా సమాచారం ప్రకారం రోజా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో  వచ్చేవారం ఆమె జడ్జీ ప్లేస్ లో సీనియర్ టాప్ హీరోయిన్ ఇంద్రజ ప్రత్యేక్షమైంది. దీంతో రోజా అభిమానులు షాక్ అయ్యారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు అనుకుని ఖంగారు పడ్డారు. కానీ అసలు  మ్యాటర్ ఏంటంటే..  ప్రస్తుతం ఏపిలో పొలిటికల్ హీట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం. దీంతో రోజా రాజకీయంగా చాలా బిజీగా బిజీగా ఉంది. జబర్ధస్త్ షోకి టైం ఇవ్వలేకపోతుంది. ఇదే విషయం మల్లెమాల యూనిట్ కి చెప్పగానే..నో ప్రాబ్లం మేడం గారు..ఆ జడ్జి ప్లేస్ ఎప్పటికి మీకే అని చెప్పి..కొన్ని ఎపిసోడ్స్ కి ఆమె స్థానంలోకి ఇంద్రజను తీసుకొచ్చారట. ప్రస్తుతం ఇంద్రజ మల్లెమాల యూనిట్ లో ఒక మెంబర్ అయిపోయారు .. సో ఇక కొన్ని రోజులు మనం రోజా ని జబర్ధస్త్ లో చూడలేమనమాట. మరి చూడాలి రోజా స్దానాన్ని ఇంద్రజ ఎంత వరకు అందుకోగలదో..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: