సాహసోపేత నిర్ణయం తీసుకున్న అనుష్క !

Seetha Sailaja
‘బాహుబలి’ మూవీ తరువాత అనుష్క ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె నటించిన ఏఒక్క సినిమా హిట్ కాలేదు. దీనితో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు కథా నాయకగా మారి నయన తార రేంజ్ ని అందుకోవాలి అని భావించిన అనుష్క కలలు నెరవేరలేదు. దీనికితోడు ఆమెకన్నా వయసులో చిన్నదైన పూజా హెగ్డే రష్మిక ల హవా ముందు అనుష్క నిలబడలేకపోయింది.

టాప్ హీరోల సినిమాలలో ఆమెకు అవకాశాలు దక్కకపోవడంతో ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రభాస్ ప్రోత్సాహం మరొకసారి అనుష్కను మరొక సినిమాలో నటించేలా ఉత్సాహ పరుస్తోంది. ఇప్పటివరకు మీడియాలో ఊహాగానాలతో పరిమితం అయిన అనుష్క లేటెస్ట్ మూవీని ప్రభాస్ సన్నిహితుల సొంత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ‘మిర్చి’ ‘భాగమతి’ మూవీల తరువాత ఈ సంస్థ నిర్మించే ఈమూవీ ఒక మళయాళ సినిమాకు రీమేక్ అని అంటున్నారు.

ఈమూవీలో అనుష్క ఒక మోడ్రన్ భావాలు కల్గిన యువతిగా కనిపిస్తుందట. తన ఆఫీసులో పనిచేసే తనకన్నా వయసులో చిన్నవాడైన ఒక వ్యక్తితితో సహజీవనం చేస్తూ ఆమెకు పిల్లలు పుట్టినప్పుడు సొసైటీలో ఏర్పడే సమస్యల చుట్టూ ఈకథ తిరుగుతుందని అంటున్నారు. ఈమూవీలో అనుష్క పక్కన హీరోగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు. వాస్తవానికి ఈమూవీ ప్రాజెక్ట్ ఓకె చెప్పడానికి అనుష్క చాల కాలం ఆలోచనలు చేసింది.

అయితే ప్రభాస్ ప్రోత్సాహంతో ఈమూవీలో  నటించడానికి అనుష్క అంగీకరించింది అంటూ వార్తలు హల చల్ చేస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా అనుష్క లాంటి టాప్ హీరోయిన్ నవీన్ పోలిశెట్టి లాంటి చిన్న హీరోతో నటించడం ఏమిటి అంటూ ఆమె అభిమానులు తెగ మధనపడుతున్నారు. ఈమూవీని తెలుగు తమిళ కన్నడ భాషలలో ఒకేసారి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తూ మహేష్ అనే ఒక యంగ్ డైరెక్టర్ ని ఈమూవీ ద్వారా పరిచయం చేస్తున్నారు. అన్నీ అనుకున్నవి అంకున్నట్లుగా జరిగితే ఈమూవీ వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ కు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: