అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేష్..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ కీర్తి సురేష్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమా లోనే తన అందంతో, అభినయంతో, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగునాట మంచి సినిమా ఆఫర్లను దక్కించుకుంది. అందులో భాగంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఎనలేని  పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది. కీర్తి సురేష్ కేవలం కమర్షియల్ సినిమాలలో మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. కీర్తి సురేష్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళ సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ మరొక క్రేజీ సినిమా ఆఫర్ ను కొట్టేసింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతోంది అటు అనేక రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకుని ఉద్దేశ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త కనుక నిజమైతే కీర్తి సురేష్ మరో క్రేజీ సినిమా ఆఫర్ ను కొట్టేసినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసి సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల పనులు పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కీర్తి సురేష్ కూడా ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు నాని హీరోగా తెరకెక్కుతున్న దసరా సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: