సాయి ధరమ్ తేజ్ తరువాత సినిమా హీరోయిన్ ఆమేనటా...!

murali krishna
మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ కి గురైన విషయం అందరికి తెలిసిందే. తీవ్ర గాయాలు కావడంతో దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించారని సమాచారం..

కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నాడని కూడా టాక్ వచ్చిందని ఫైనల్ గా దసరా సమయంలో ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారని తెలుస్తుంది.అప్పటినుంచి తేజుని కలవడానికి చాలా మంది ఇండస్ట్రీ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లారని తెలుస్తుంది.కానీ తేజుకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదని సమాచారం.తాజాగా దీపావళి పండగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలుస్తుంది.

ఈ ఫోటో చూసిన అభిమానులంతా ఖుషీ అయిపోయారని సమాచారం. సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది.. తేజు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే.. కొన్ని రోజుల్లోనే షూటింగ్ లో పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి.జనవరి నెల నుంచి ఈ మెగాహీరో సెట్స్ పైకి వెళ్లనున్నారని సమాచారం.సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ శిష్యుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను తీసుకుంటున్నట్లు వార్త వినిపిస్తుంది.

ఇప్పటివరకు మలయాళ, తమిళ మరియు కన్నడ చిత్రాల్లో నటించిన సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.ఈ సినిమాలో రానా భార్య పాత్రలో ఆమె కనిపించనుందని తెలుస్తుంది.కథ ప్రకారం.. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ కూడా క్రేజ్ ఉన్న సినిమా కావడంతో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తుంది.ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఆమెకి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని సమాచారం.. సాయి ధరమ్ తేజ్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశల్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: