డిసెంబర్ పై కన్నువేసిన బాలకృష్ణ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ అంచనాలు కలిగి ఉన్న సినిమాలలో అఖండ సినిమా  ఒకటి. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  సినిమాపై జనాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూడడానికి ప్రధాన కారణం ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ లుగా నిలవడమే ప్రధాన కారణం.  అలాగే ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ రైతుగా,  అఘోరాగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇందుకు సంబంధించిన ప్రోమో లను ఇప్పటికే చిత్ర బృందం బయటకు వదలగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి.

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.  అయితే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఇ క ఈ సినిమాను డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కొన్ని రోజుల క్రితం వరకు దసరా బరిలో నిలుస్తుంది అని అనేక వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దీపావళి కానుకగా ఈ సినిమాను చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇలా దీపావళి కి కూడా ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ మెంట్ రాకపోవడం తో ఈ సినిమాను డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయబోతున్నారు అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా లో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: