నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

P.Nishanth Kumar
గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాప్ లను అందుకుంటున్నాడు హీరో నాని. అయన సినిమాలు వరుసగా ఓటీటీ లో విడుదల అవడమే కాకుండా అవి ప్రేక్షకులను పెద్ద గా మెప్పించక పోవడం కూడా నాని ని మరింతగా వెనక్కి నెట్టేస్తుంది అని చెప్పొచ్చు. తాజగా విడుదల చేసిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ లో విడుదలై ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. దాంతో ఈ సారి చేసే సినిమాలను ఎంతో జాగ్రత్తగా ఆచితూచి చేయాలనీ డిసైడ్ అయ్యాడు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో అయన చేసిన శ్యామ్ సింగ రాయ్ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుండగా ఈ సినిమా పై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
సాయి పల్లవి, కృతి శెట్టి ఈ సినిమా లో కథానాయికలుగా నైటిస్తుండగా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా జంధ్యాల స్టైల్ లో ఎంతో ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇకపోతే నాని ఇటీవలే దసరా సినిమా ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
దసరా సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సినిమా ను అనౌన్స్ చేయగా నాని ఈ సినిమా లో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ తోనే సినిమా హిట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తుండగా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్లబోతుంది సినిమా. ఈ సినిమా లో కథానాయికగా హీరోయిన్ నిత్యామీనన్ ని అనుకుంటుండగా నాని ఫ్యాన్స్ ఆమెను వద్దని చెప్తున్నారు. ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ను ఎందుకు పెట్టుకోవడం అని సూచిస్తున్నారు. మరి వారి మాట నాని వింటాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: