సురేష్ బాబు కన్ఫ్యూజన్ లో చిక్కుకున్న రానా వెంకటేష్ లు !

Seetha Sailaja
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు తరువాత ధియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రేక్షకులు అంతంత మాత్రంగానే వస్తూ ఉండటంతో నిర్మాత సురేష్ బాబు తన ‘నారప్ప’ పై నమ్మకం లేక ఓటీటీ లో విడుదల చేసాడు. దీనితో ఒక ప్రముఖ నిర్మాత ఇలా చేయడం ఏమిటి అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఆ పరిస్థితుల మధ్య సురేష్ బాబుకు కన్ఫ్యూజన్ మరింత పెరిగి తన బ్యానర్ పై నిర్మించిన ‘దృశ్యం 2’ ‘విరాటపర్వం’ మూవీల విషయంలో ఎటూ తేల్చుకోకుండా కాలం గడుపుతూ వచ్చాడు. ఈమధ్యలో ధియేటర్లలో విడుదలైన ‘లవ్ స్టోరీ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మూవీలు ఘన విజయం సాధించడంతో ఇప్పుడు తన సినిమాలను ధియేటర్లలో విడుదల చేయాలి అన్న ఆలోచనలతో యూటర్న్ తీసుకున్నాడు.

అయితే సురేష్ బాబు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవ్వడంతో దసరా దీపావళి సీజన్లకు వచ్చే సినిమాలు అన్నీ ఖరార్ కావడమే కాకుండా వరసగా రిలీజ్ అవుతున్నాయి. దీనితో ఇప్పుడు ‘దృశ్యం’ ‘నారప్ప’ సినిమాల రిలీజ్ కు సరైన డేట్ లేకుండా పోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వచ్చేనెల నవంబర్ వరకు విడుదల కావలసిన మీడియం రేంజ్ సినిమాలు అన్నీ తమ రిలీజ్ డేట్స్ ను చాల ముందుగానే ఫిక్స్ చేసుకున్నాయి. డిసెంబర్ రెండవ వారం నుండి టాప్ హీరోల సినిమాలు ఫిబ్రవరి వరకు క్యూ కడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ‘దృశ్యం 2’ ‘విరాటపర్వం’ మూవీల రిలీజ్ కు సరైన రిలీజ్ డేట్ దొరకడం సురేష్ బాబు లాంటి నిర్మాతకు కూడ కుదరని పరిస్థితిగా మారింది అని అంటున్నారు. దీనితో మళ్ళీ యూటర్న్ తీసుకుని తన సినిమాలను ఓటీటీ లలో విడుదల చేయాలా లేదంటే సరైన రిలీజ్ డేట్ దొరికే వరకు ఆగాల అన్న అంతర్మధనంలో సురేష్ బాబు ఉన్నట్లు వార్తలు గుప్పు మంటున్నాయి. ఏది ఏమైనా సురేష్ బాబు కన్ఫ్యూజన్ తో వెంకటేష్ రానా లకు కూడ సమస్య ఏర్పడింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: