సింగర్ మనో సీరియస్.. జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు?

praveen
సింగర్ మనో.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులంటూ లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. తెలుగు చిత్ర పరిశ్రమకి ఖ్యాతిని ఎంతగానో పెంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాల సుబ్రహ్మణ్యం కి సింగర్ మన దగ్గర వ్యక్తి. అంతే కాకుండా ఏకంగా సింగర్ మనో తెలుగు చిత్ర పరిశ్రమలో వందల చిత్రాల్లో పాటలు పాడారు. అంతకుమించి ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలన్నింటికి కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పి కనిపించే రజినీకాంత్ గా మారిపోయారు సింగర్ మనో.  డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు.

 ఇటీవల కాలంలో అయితే సింగర్ మన తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గర అయిపోయారు. ఎందుకంటే ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కార్యక్రమంలో జడ్జిగా అవతారమెత్తారు మనో. రోజా సెల్వమణి తో కలిసి ప్రస్తుతం జబర్దస్త్ జడ్జిగా సందడి చేస్తున్నారు. ఇక తన నవ్వులతో పువ్వులు పోయిస్తున్నారు సింగర్ మనో. సింగర్ మను జబర్దస్త్ కి రావడానికి ముందు ఎంతో మంది జడ్జీలు గా వచ్చారు. కానీ ఇక చివరికి సింగర్ మనో ఫైనల్ అయిపోయారు.ఎన్నో రోజుల నుంచి జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగుతూ కమెడియన్స్ అందరికీ కూడా మరింత ఎంకరేజ్మెంట్ అందిస్తూ వస్తున్నారు.

అయితే సింగర్ మనో ఎప్పుడూ జబర్దస్త్ లో నవ్వుతూ ఉండడం ఇక కంటెస్టెంట్స్ పై పంచులు వేస్తూ ఉండటం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల ఏం జరిగిందో తెలియదు గానీ సింగర్ మనో ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. రాకింగ్ రాకేష్ స్కిట్ చేస్తున్న సమయంలో ఇంత గొప్ప స్టేజి మీద ఏం చేస్తున్నావ్ రాకేష్ అని అడుగుతాడు.. అంటే కామెడీ చేస్తున్నాను సార్ అని రాకేష్ సమాధానం చెప్పగానే కోపంతో ఏకంగా జడ్జి సీట్ నుంచి దిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆపడానికి వచ్చిన  రాకేష్ ను కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే సింగర్ మనో ఎందుకు ఒక్కసారిగా సీరియస్ గా వెళ్లిపోయాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: