ఒక్క హిట్టుతో రెమ్యునరేషన్ పెంచేసిన అక్కినేని హీరో..!!

Anilkumar
టాలీవుడ్ అక్కినేని హీరో అఖిల్ మొన్నటి వరకు వరుస డిజాస్టర్ లతో సతమతమయ్యాడు. అయితే తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పాటు భారీ కలెక్షన్లను సైతం కొల్లగొట్టింది. ఎట్టకేలకు తన కెరియర్లో మొదటి విజయాన్ని అందుకున్నాడు అఖిల్. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగితేలుతున్నాడు ఈ అక్కినేని వారబ్బాయి. అయితే ఒక్క హిట్ పడిందో లేదో అప్పుడే ఉన్నట్టుండి తన రెమ్యునరేషన్ ని పెంచేశాడు ఈ అక్కినేని హీరో.

 ఇక మొన్నటిదాకా వరుస ఫ్లాపులతో ఉన్న అఖిల్ తన తోటి మిగతా హీరోలతో పోల్చుకుంటే ఓ సినిమాకి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వాడు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న అఖిల్ కి మార్కెట్ కూడా పెరగడంతో తన తదుపరి సినిమా కోసం రెమ్యునరేషన్ని అమాంతంగా పెంచేశాడట. ప్రస్తుతం అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమా చేస్తున్నాడు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాకి అఖిల్ కమిట్మెంట్ ఇచ్చేయడంతో తన గత సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ని ఏజెంట్ సినిమాకి తీసుకోబోతున్నాడు అఖిల్.

కానీ ఇకపై తాను నటించబోయే సినిమాల కోసం రెమ్యునరేషన్ ని పెంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.అయినా కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ అవడంతో పలువురు దర్శక నిర్మాతలు అఖిల్ తో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఒక్క సినిమాతో అఖిల్ తన రెమ్యునరేషన్ ని పెంచడంతో ఈవార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది అక్కినేని అన్నదమ్ములిద్దరు మంచి విజయాలు అందుకున్నారు. నాగచైతన్య 'లవ్ స్టోరీ' సినిమాతో మంచి సక్సెస్ అందుకోగా.. ఇక తాజాగా అఖిల్ కూడా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో మంచి హిట్ అందుకున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: