అనుష్క ఇన్ని సమస్యలతో సతమతమవుతోందా..?

Divya
హీరోయిన్ అనుష్క శెట్టి గత కొద్ది సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. చివరిసారిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకులను అలరించి ఆ తరువాత కనిపించలేదు అనుష్క. ఇక ఆ తర్వాత ఈమె పై రకరకాల రూమర్లు కూడా వచ్చాయి. ఇక ఈమె అధిక బరువు వల్ల బాధ పడుతోందని, వయసు కూడా ఎక్కువగా మీద పడుతుండడంతో తమ ఇంట్లో వారు ఈమెకు పెళ్లి చేయాలని భావిస్తున్నట్లుగా ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. బాహుబలి లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనుష్కకు వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాల్లో బిజీ అయిపోతుందని, అంతేకాదు హిందీ పరిశ్రమకు కూడా వెళుతుందని అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా మారుతుందని ఆమె అభిమానులు అంచనాలు వేసినప్పటికీ అవి ఏవీ కూడా నిజం కాలేదు..
సైజ్ జీరో సినిమా కోసం పెరిగిన అధికబరువు నుంచి బయట పడడానికి రకరకాల నాచురల్ చికిత్సా విధానాలను కూడా అనుసరిస్తున్నప్పటికీ ఆమెలో ఏ మాత్రం తేడా రాకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ఆమె వేరే సినిమాలకు కూడా సంతకాలు చేయలేక పోతుందట.. తాజాగా అనుష్క మారిన రూపం అంటూ ఫిల్మ్ నగర్ లో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక అనుష్క అభిమానుల నుంచి ఈ ఫోటోలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.. నిజానికి ఈమె తన బరువును పూర్తిగా తగ్గించుకోలేదు..
కానీ అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క కొంత బరువు తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు మునుపటి కంటే చాలా ఫిట్ గా కూడా కనిపిస్తోంది.. అయితే ఈమె తన స్లిమ్ లుక్ ను తిరిగి సాధించడానికి ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది అని కాకపోతే మునుపటి లుక్ తో పోలిస్తే తన రూపం కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది అని కూడా సమాచారం. ఇకపోతే అనుష్క భాగమతి సినిమా తర్వాత యు.వి.క్రియేషన్స్ లో ఒక మూవీకి కమిట్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: