భోళా శంకర్ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్...ఎప్పటినుండి అంటే..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ చిత్రం గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను బోలా శంకర్ గా ప్రకటించగా ఈ సినిమాను పట్టాలు ఎక్కించాలని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా తాజాగా బోలా శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లే తేదీని కూడా స్పష్టం చేశారు.

వచ్చే నెల 11వ తేదీన ఉదయం 7 :45 నిమిషాలకు భోళా శంకర్ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా అదే నెల 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలు పెడుతున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే భోళా శంకర్ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా ఈ సినిమా ను తమిళంలో ఆమధ్య వచ్చిన అజిత్ వేదాళం అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ చుట్టూ తిరిగే యాక్షన్ మూవీ అంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది.

అయితే తమిళంలో లక్ష్మీమీనన్ చేసిన పాత్రను తెలుగులో మహానటి కీర్తి సురేష్ చిత్రం చేయనుంది. ఇక ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాలో మెగాస్టార్ కు సోదరిగా మొదట గా రౌడీ బేబీ సాయి పల్లవి ని సంప్రదించగా సాయి పల్లవి కొన్ని కారణాల వల్ల నో చెప్పేసింది.. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల లవ్ స్టోరీ సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా గుర్తు  చేశారు. ఇక మెహర్ రమేష్ గతంలో బిల్లా లాంటి సూపర్ హిట్ సినిమాతో పాటు కంత్రి షాడో లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: