అతీంద్రియ ఆలోచనల వైపు సమంత అడుగులు !

Seetha Sailaja

సమంత నాగచైతన్యతో విడిపోయిన తరువాత తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ ఆమె ప్రస్తుతం షేర్ చేస్తున్న విషయాలు ఫోటోలు ఆమెలో వచ్చిన కొత్త మార్పును సూచిస్తున్నాయి. దసరా పండుగరోజున రెండు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను ప్రకటించిన సమంత ఆసినిమాల షూటింగ్ ఇంకా మొదలు కాకుండానే మనశ్శాంతి కోసం కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాల బాట పట్టింది.
 
 సమంత తన స్నేహితురాలు ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలసి ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ యమునోత్రి కి వెళ్ళి అక్కడ నుండి ఉత్తర భారతాన ఉన్న రిషీకేశ్ లోని మహర్షి మహేశ్ యోగి ఆశ్రమాన్ని సందర్శించింది. ఇప్పటికే ఈ విషయాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  
 
 
 మహేశ్ యోగి ఆశ్రమానికి 1968లో బీటిల్స్ సభ్యులు వెళ్ళారని అక్కడే కొన్ని రోజులు ఉండి అతీంద్రియ ధ్యానాన్ని అభ్యసించారని సమంత పేర్కొందిఆ సమయంలో దాదాపు 48 పాటలను ఇదే ఆశ్రమంలో స్వరపరిచారని అలాంటి ప్రదేశంలో తాను ఇప్పుడు నిల్చున్నానని సామ్ తెలిపింది. అలాంటి ప్రదేశంలో తాను నిలుచుని ఉన్నప్పుడు తనలో ఒక చైతన్యం కల్గిందని ఈ ఆధ్యాత్మిక యాత్ర ద్వారా మానసిక ప్రశాంతతను  పొందుతున్నానని తెలియ చేసింది.
 
 ఈమధ్య సమంత సోషల్ మీడియాలో తనపై కొన్ని వెబ్ ఛానల్స్ దుష్ప్రచారం చేశారంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తెలుపుతుంది అన్న ఆశక్తి అందరిలోను ఉంది. ఈవిషయమై కోర్టు ఇచ్చే తీర్పు బట్టి భవిష్యత్ లో సినిమా సెలెబ్రెటీ లపై గాసిప్పులు ప్రచారం చేస్తూ వీడియోలను పెడుతున్న కొన్ని వెబ్ ఛానల్స్ కు చెక్ పడే ఆస్కారం ఉంది అని అంటున్నారు. జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పటికీ వాటిని లెక్క చేయకుండా పరిస్థితులతో పోరాటం చేస్తున్న సమంత స్ఫూర్తి అనేకమంది హీరోయిన్స్ కు మార్గదర్శకురాలుగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: