కృష్ణంరాజు మంచి మనసుకు ప్రభాస్ అభిమానుల ప్రశంసలు !

Seetha Sailaja
రెబల్ స్టార్ కృష్ణంరాజు అతిధి మర్యాదలకు పెట్టింది పేరు. తన ఇంటికి ఎవరైనా అతిధిని భోజనానికి పిలిచినప్పుడు కనీసం 20 రకాల పదార్థాలు లేకుండా భోజనం పెట్టడం కృష్ణంరాజుకు అలవాటు. ఈ అలవాటు అందరికీ తెలియడంతో ఆయన ఎవరినైనా భోజనానికి రమ్మని ఆప్యాయంగా పిలిస్తే ఇండస్ట్రీలోని వారంతా చాల హడలిపోతారని జోక్ చేస్తూ ఉంటారు.

ఈ పరిస్థితుల మధ్య కృష్ణంరాజు మంచి మనసును చాటి చెప్పే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణంరాజు ఇంటిలో గత 25 సంవత్సరాలుగా ఒక పనిమనిషి పని చేస్తుందట ఆమెను ఆయన కుటుంబ సభ్యులు పనిమనిషి లా కాకుండా సొంత మనిషి లా చూసుకుంటూ ఎంతో ఆదరిస్తూ వచ్చారట. కృష్ణంరాజు పిల్లలను చిన్నప్పటి నుండి ఆమె ఒక ఇంటి మనిషిలా చూసుకుందట.

ఆమె కృష్ణంరాజు ఇంటిలో పనిచేయడానికి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆమెకు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు సత్కారం చేయడమే కాకుండా ఆమె చేత కేక్ కోయించి విలువైన బహుమతులు కూడ ఇచ్చారట. ఈ విషయాన్ని కృష్ణంరాజు కుమార్తె ప్రసీద సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తమ కుటుంబ సభ్యులు ఆ పనిమనిషిని సత్కరిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ‘థాంక్స్’ పద్మ ఆంటీ అంటూ కామెంట్ చేసింది.

ఇప్పుడు ఈ ఫోటో ప్రభాస్ అభిమానుల మధ్య వైరల్ గా మారింది. ప్రభాస్ కూడ కృష్ణంరాజు అలవాట్లను అమ్దిపుచ్చుకుంటూ తన దగ్గర ఉన్న వారికి ఎంతోమందికి సహాయం చేసిన విషయానికి సంబంధించిన వార్తలు గతంలో వచ్చాయి. ప్రభాస్ కూడ కృష్ణంరాజు లానే భోజన ప్రియుడు మాత్రమే కాకుండా అతిధి మర్యాదలలో తన పెదనాన్నని మించిపోతాడు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ‘రాథే శ్యామ్’ గురించి ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి రేసుకు రాబోతున్న ఈమూవీ రికార్డులు క్రియేట్ చేసి ప్రభాస్ అభిమానుల కోరికను తీరుస్తుందని ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: