రాథే శ్యామ్ లో లీకులు !

Seetha Sailaja
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రాథే శ్యామ్’ మూవీకి సంబంధించి ఏచిన్న లీకు వచ్చినప్పటికీ అది వెంటనే వైరల్ గా మారిపోతోంది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం 50 కోట్లు ఖర్చు పెట్టారట. దాదాపు 15 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్  సీన్ ‘మగధీర’ రేంజ్ లో ఉంటుందనే లీకులు వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ మూవీలో కృష్ణంరాజు పాత్ర హైలెట్ అని అంటున్నారు. ఈ మూవీలో పరమహంస అనే యోగి పాత్రలో కృష్ణంరాజు కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రభాస్ గత జన్మకు సంబంధించిన విషయాలను చెపుతూ ఈ మూవీని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకు వెళ్ళే అత్యంత కీలకమైన పాత్ర కృష్ణంరాజు ది అని అంటున్నారు.

ఈ సినిమాలోని సచిన్ కేద్కర్ భాగ్యశ్రీ మురళీ శర్మ పాత్రలకు కూడ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈమూవీకి సంబంధించిన ప్రమోషన్ డిసెంబర్ నుండి ఒక నెల ముందుగా ప్రారంభిస్తారని టాక్. ప్రస్తుతం పూజ హెగ్డే గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పరిగణింప బడుతున్న పరిస్థితులలో ఆ సెంటిమెంట్ కూడ ఈమూవీకి బాగా పనికి వస్తుంది అని అంటున్నారు.

వరసపెట్టి భారీ పాన్ ఇండియా మూవీలు ఒకదాని వెంట ఒకటి చేస్తున్న ప్రభాస్ కు ప్రస్తుతం బాలీవుడ్ లో ఏర్పడ్డ ఖాళీ బాగా కలిసి వస్తే అవకాశం ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమాలకు బాలీవుడ్ లో కూడ ఆదరణ బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే పాన్ ఇండియా ఇమేజ్ ని ఏర్పరుచుకున్న ప్రభాస్ ఖాన్ త్రియం అందుకోలేకపోతున్న బ్లాక్ బష్టర్ హిట్ ను అందుకోగలిగితే ప్రభాస్ పారితోషికం 100 కోట్ల స్థాయిని దాటిపోయిన ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ‘రాథే శ్యామ్’ ఫలితం బట్టి ప్రభాస్ కెరియర్ ఆధారపడి ఉంటుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: