డ్ర‌గ్స్ కేసులో లైగ‌ర్ బ్యూటీకీ ఎన్సీబీ స్ట్రాంగ్ వార్నింగ్..!

MADDIBOINA AJAY KUMAR
బాలీవుడ్ ముద్దుగుమ్మ అన‌న్య పాండే షారుక్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో చిక్కుకున్న సంగ‌తి తెలిందే. ఆర్య‌న్ ఖాన్ తో అన‌న్య డ్ర‌గ్స్ గురించి ఛాటింగ్ చేసింద‌న్న నేప‌థ్యంలో ఎన్సీబీ అధికారులు బ్యూటీని విచారిస్తున్నారు. అయితే మొద‌ట ఒక‌సారి అన‌న్య ఎన్సీబీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌వ‌గా నిన్న మ‌రోసారి అన‌న్య ఎన్సీబీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యింది. అయితే విచార‌ణ సంధ‌ర్బంగా ఆన‌న్య‌కు ఎన్సీబీ అధికారులు వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. విచ‌ర‌ణ‌కు పిలుస్తే అన‌న్య పాండే మూడు గంట‌లు ఆల‌స్యంగా హాజ‌ర‌య్యింద‌ట‌. అన‌న్య విచార‌ణ‌కు ఆల‌స్యంగా రావ‌డంతో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆమెపై ఆగ్ర‌హానికి గురయ్యార‌ట‌. 

మ‌రి తాను బాలీవుడ్ హీరోయిన్ ఎంతో క్రేజ్ ఉంది అని అనుకుందో ఏమో కానీ అన‌న్య మూడు గంట‌లు ఆల‌స్యంగా వెళ్లి అధికారుల‌తో తిట్లు తినేసింది. ఇక అన‌న్య‌ను మొద‌టి రోజు విచారించిన అధికారులు ఆర్య‌న్ తో డ్ర‌గ్స్ ఛాటింగ్ గురించి ప్ర‌శ్నించ‌గా..ఆర్య‌న్ షారుక్ అంకుల్ ఫ్రెండ్ అని త‌ను చాలా క్లోజ్ అని అందువ‌ల్ల అత‌డి గంజాయి అడిగితే ఫ‌న్నీగా తెప్పిస్తా అని సమాధానం ఇచ్చా అని చెప్పుకొచ్చింది. ఇక నిన్న అనన్య‌ను రెండో సారి విచారించిన ఎన్సీబీ అధికారులు ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేద‌ని మ‌రోసారి విచార‌ణ‌కు ఆహ్వానిస్తే రావాల‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా అన‌న్య షారుక్ ఖాన్ కూతురి బెస్ట్ అని బాలీవుడ్ మీడియా చెబుతోంది.

అంతే కాకుండా ఆర్య‌న్... అన‌న్య. షారుక్ కూతురు క‌లిసి ఎక్కువ‌గా పార్టీల‌కు వెళుతుంటార‌ని కూడా ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దాంతో షారుక్ ఖాన్ కూతురును కూడా ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో విచారించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా అన‌న్య పాండే మొద‌ట టాలీవుడ్ లో వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన సినిమా లోఫ‌ర్ తోనే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవ్వ‌గా ప్ర‌స్తుతం మాత్రం బాలీవుడ్ లోనే ఫుల్ బిజీగా మారింది. ఇక ఇప్పుడు మ‌న క్రేజీ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాత్ మ‌రోసారి తెలుగు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ కోసం అన‌న్య‌ను హీరోయిన్ గా సెట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: