బాలయ్య మనసు నిజంగా వెన్న సుమా... ?

Satya
నందమూరి బాలక్రిష్ణ అంటే విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీయార్ తనయుడు, ఆయన నటనకు వారసుడు అని మాత్రమే తెలుసు. కానీ అంతకు మించి ఆయన ఒక మానవతామూర్తిగా చాలా కొద్ది మందికే తెలుసు. బాలయ్య మనసు వెన్న లాంటిది అని దగ్గరగా చూసిన వారు చెబుతారు.
బాలయ్య మాట ఇచ్చారంటే తప్పరు, ఆయనకు శత్రువులు కూడా ఎవరూ లేరు. ఆయన అందరి వాడు. బాలయ్య మనసులో ఏమీ దాచుకోరు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు అని ఈ మధ్యనే ప్రముఖ దర్శకుడు అల్లు అరవింద్ చెప్పారు. ఆయన ఓటీటీ ఫ్లాట్ ఫారం ఆహా ద్వారా బాలయ్య టాక్ షో చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య గురించి అరవింద్ అన్న మంచి మాటలివి. ఆయన ఒక్కరే కాదు, ఎవరైనా బాలయ్యను దగ్గరగా చూస్తే, ఒకసారి ఆయన గురించి తెలుసుకుంటే ఇలాగే అంటారు.
బాలయ్య ఎవరికీ తెలియకుండా ఎన్నో దానాలు చేస్తారు. ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఎంతో మందికి ఉచితంగా అక్కడ వైద్యం ఇప్పించారు. ఇక బాలయ్య చారిటీ గురించి కూడా చాలా తక్కువ తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే ఆహా టాక్ షో బాలయ్య చేస్తున్న నేపధ్యంలో ఈ సీజన్ కి గానూ ఆయనకు నాలుగైదు కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నారు. ఈ మొత్తం అంతా కూడా బాలయ్య చారిటీకే ఖర్చు చేయబోతున్నారుట. ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇంతలా కోట్లలో మొత్తాన్ని ఖర్చు చేసే హీరోగా బాలయ్య టాలీవుడ్ లో చరిత్రలో నిలిచి పోతారేమో. బాలయ్య దేని కోసం ఈ మొత్తాన్ని ఇస్తారో ఆయనే త్వరలో చెబుతారు. దీపావళి నుంచి బాలయ్య టాక్ షో ఓటీటీ ద్వారా రానుంది. మొత్తానికి హీరోగా రీల్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా తనకు సాటీ పోటీ లేదని బాలయ్య రుజువు చేశాడు అంటున్నారు అంతా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: